ప్రారంభమైన రామ మందిర నిర్మాణం: ఐరన్ లేకుండా కన్‌స్ట్రక్షన్

Published : Aug 20, 2020, 03:48 PM IST
ప్రారంభమైన రామ మందిర నిర్మాణం: ఐరన్ లేకుండా కన్‌స్ట్రక్షన్

సారాంశం

రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీన  రామ మందిర నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.  


న్యూఢిల్లీ: రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీన  రామ మందిర నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.

ఈ ఆలయాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో రామజన్మభూమి ట్రస్ట్ ప్రయత్నిస్తోంది.ఎల్ అండ్ టీ సంస్థతో కలిసి ఐఐటీ మద్రాస్, సీబీఆర్ఐ రూర్కీ ఇంజనీర్లు ఈ ప్రాంతంలో మట్టిని పరీక్షిస్తున్నారు.

పురాతన , సంప్రదాయబద్దంగా ఆలయ నిర్మాణ పనులను చేపడుతున్నారు. భూకంపాలు, తుపానులతో పాటు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోనేలా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. 

also read:అయోధ్య భూమి పూజలో పూజలో మోడీతో వేదిక పంచుకున్న గోపాల్ దాస్ కు కరోనా

రాతి దిమ్మెలను ఒక దానిని మరో దానితో కలపడానికి రాగి పలకలను ఉపయోగిస్తున్నారు. రామ మందిర నిర్మాణంలో ఇలాంటి 10 వేల మందికి పైగా ప్లేట్లు అవసరమని రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది.

రాగి పలకాలు 18 అడుగుల పొడవు, 30 మి.మీ. వెడల్పు, 3 మి.మీ లోతు ఉండాలని  ట్రస్టు తెలిపింది. రాగి పలకలను ట్రస్టుకు విరాళంగా ఇవ్వాలని కోరారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఇనుమును ఉపయోగించడం లేదు. ఇనుము వాడకుండా పురాతన పద్దతుల్లో ఈ ఆలయాన్నినిర్మించనున్నారు.

PREV
click me!

Recommended Stories

వెనకా, ముందు ఎస్కార్ట్ రైళ్లు.. మధ్యలో రాష్ట్రపతి కోసం ప్రత్యేక రైలు. ఇదొక న‌డిచే రాజ‌భ‌వ‌నం
డ్రగ్స్ రహిత సమాజం కోసం మోదీ మాస్టర్ ప్లాన్ | Nasha Mukt Yuva for Viksit Bharat Explained