Ayodhya: నీలకంఠ పక్షిని చూడటానికి తరలుతున్న రామ భక్తులు.. ఎందుకంటే?

By Mahesh KFirst Published Jan 22, 2024, 4:35 AM IST
Highlights

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తరలివస్తున్న భక్తులు ఒక కొత్త సంప్రదాయానని పాటిస్తున్నారు. ఆగ్రాలో సగం మంది రామ భక్తులు వైల్డ్ లైఫ్‌కు వెళ్లి మరీ నీలకంఠ పక్షిని చూసి వస్తున్నారు.
 

Lord Ram: అయోధ్య రామ మందిరలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ కార్యక్రమం కోసం అయోధ్యం సర్వం సిద్ధమైంది. రామ భక్తులూ పెద్ద ఎత్తున అయోధ్యకు తరలివస్తున్నారు. ఈ సందర్బంగా అందులో చాలా మంది ఈ ప్రాణ ప్రతిష్ట దివ్య కార్యక్రమాన్ని పురస్కరించుకుని పవిత్రమైన నీలకంఠ పక్షిని చూడ తరలుతున్నారు.

ఆగ్రాలో పెద్ద సంఖ్యలో రామ భక్తులు చంబల్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీకి వెళ్లుతున్నారు. అక్కడ రామాయణంలో పేర్కొన్న నీలకంఠ పక్షిని చూసి వెనక్కి మరలుతున్నారు. రాముడు ఈ పక్షిని చూసిన తర్వాతే లంకాధీశుడిని చంపేసి లంకను తన అదుపులోకి తెచ్చుకున్నట్టు నమ్ముతారు.

Latest Videos

పక్షిని చూడాలనే సంస్కృతి పాతదే. తెలంగాణలోనూ ప్రజలు దసరా రోజు న పాలపిట్ట చూడాలని అంటూ ఉంటారు. అందుకోసం ఎప్పుడూ ఆకాశం వైపు చూస్తూ పాలపిట్ట పక్షిని వీక్షించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. చూసిన వారు తమకు అదృష్టంగా దాన్ని భావిస్తారు. ఇలాంటిదే.. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చుట్టూ వినిపిస్తున్నది.

Also Read : Ayodhya: రామ మందిర భక్తులకు అందించే మహా ప్రసాదం ఇదే.. ‘లడ్డూ, సరయూ నీరు సహా.. ’

రావణుడిని చంపడానికి ముందు రాముడు ఒక శమీ చెట్టును తాకి.. ఆ తర్వాత నీలకంఠ పక్షి ని చూశాడని చెబుతారు. ఆ తర్వాతే లంకను ఆక్రమించినట్టు అంటుంటారు. అలాగే, నీలకంఠ పక్షిని శివుడి అవతారంగానూ చూస్తారు.

click me!