బ్రేకింగ్: ఎంపీ అమర్‌సింగ్ కన్నుమూత

Siva Kodati |  
Published : Aug 01, 2020, 04:53 PM ISTUpdated : Aug 01, 2020, 05:16 PM IST
బ్రేకింగ్: ఎంపీ అమర్‌సింగ్ కన్నుమూత

సారాంశం

సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం అమర్ సింగ్ ఆరోగ్యం విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అమర్‌సింగ్‌కు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

2013 నుంచి కిడ్సీ సమస్యతో బాధపడుతున్న ఆయన కొన్ని నెలల పాటు సింగపూర్‌లో చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో జన్మించిన అమర్‌సింగ్.. 1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో చివరి సారిగా పెద్ద సభకు సమాజ్‌వాదీ పార్టీ నుంచి నామినేట్ అయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..
మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?