కౌన్ బనేగా రాజస్థాన్ సీఎం... సోనియాతో సచిన్ పైలట్ భేటీ, అధినేత్రి నిర్ణయంపై ఉత్కంఠ

Siva Kodati |  
Published : Sep 29, 2022, 08:53 PM ISTUpdated : Sep 29, 2022, 09:38 PM IST
కౌన్ బనేగా రాజస్థాన్ సీఎం... సోనియాతో సచిన్ పైలట్ భేటీ, అధినేత్రి నిర్ణయంపై ఉత్కంఠ

సారాంశం

తదుపరి రాజస్థాన్ సీఎంగా ఎవరు కాబోతున్నారనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ భేటీ అయ్యారు. 

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ భేటీ అయ్యారు. రాజస్ధాన్ కొత్త సీఎం ఎంపికపై సోనియా దృష్టి సారించారు. సీఎం రేసులో సచిన్ పైలట్ వున్నట్లుగా సమాచారం. అయితే అంతకుముందు సీఎం అశోక్ గెహ్లాట్ కూడా సోనియాతో భేటీ అవ్వడం రాజస్థాన్‌తో పాటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అనంతరం సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడుతూ.. రాజస్థాన్ రాజకీయాలపై సోనియాతో చర్చించినట్లు తెలిపారు. జైపూర్‌లో ఏం జరుగుతుందో సోనియాకు వివరించానని ఆయన తెలిపారు. తన అభిప్రాయాలను సోనియాకు చెప్పానని సచిన్ వెల్లడించారు. 2023 ఎన్నికల్లో మళ్లీ పార్టీ విజయమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

కాగా.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికతోపాటు రాజస్తాన్‌లోనూ రాజకీయం జోరందుకుంది. అశోక్ గెహ్లాట్ అనుయాయులు తిరుగుబాటు చేయడంతో రాజస్తాన్‌లో కాంగ్రెస్ చీఫ్ కంటే కూడా రాష్ట్ర భవిష్యత్‌ ఆసక్తికరంగా మారింది. ఈ చర్చలో సీఎం సీటు ప్రధానంగా ఉన్నది. రాజస్తాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ కొనసాగుతారా? లేక ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సచిన్ పైలట్‌కు కాంగ్రెస్ అధిష్టానం చాన్స్ ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ రోజు సోనియా గాంధీతో సమావేశం తర్వాత సీఎం అశోక్ గెహ్లాట్ రెండు కీలక ప్రకటనలు చేశారు. అందులో ఒకటి తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయను అని వెల్లడించారు. మరో విషయం రాజస్తాన్ సీఎం పీఠంపై మాట్లాడారు. రాజస్తాన్ సీఎంగా కొనసాగుతారా? అని మీడియా అడగ్గా.. ఆ విషయాన్ని సోనియా గాంధీకే అప్పజెప్పానని వివరించారు. అంటే.. ఆ నిర్ణయం సోనియా గాంధీ చేతిలో ఉన్నదని స్పష్టం చేశారు. తనకు అనుయాయులైన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం తామందరినీ కంపించిందని అశోక్ వివరించారు. ఇందుకు తాను బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పానని, అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుంటున్నా అని తెలిపారు. సీఎం విషయంపైనా నిర్ణయం సోనియాకే వదిలిపెట్టినట్టు తెలిపారు.

ALso REad:2024 ఎన్నికలు: రాజస్తాన్ సీఎం ఎవరు? గెహ్లటా.. పైలటా? సోనియా గాంధీ నిర్ణయం ఎవరి వైపు?

ఇదిలావుండగా... కాంగ్రెస్ చీఫ్ కోసం అశోక్ గెహ్లాట్ సరైన వ్యక్తి అని అధిష్టానం భావించింది. అంతకు ముందే ఆయన సీఎం పదవి వదులుకోవాలని ఆదేశించింది. అంతేకాదు, సీఎం ఎవరనే నిర్ణయం తమ వద్దే ఉంటుందని కూడా పేర్కొంది. కానీ, సీఎం పదవి వెంటబెట్టుకునే చీఫ్ కోసం పోటీ చేద్దామని గెహ్లట్ భావించారు. కానీ, ఒకరికి ఒక పదవి అనే నిబంధనను కాంగ్రెస్ పాటిస్తుందని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. రాహుల్ ప్రకటన తర్వాతే రాజస్తాన్‌లో ఎమ్మెల్యేల తిరుగుబాటు లేసింది. సచిన్ పైలట్‌ను సీఎంగా చేయరాదని, సచిన్ తిరుగుబాటు చేసినప్పుడు గెహ్లాట్‌తో ఉన్నవారిలో నుంచే సీఎంను ఎన్నుకోవాలని వారు తేల్చిచెప్పారు. ఇది అధిష్టానాన్ని తీవ్రంగా అసంతృప్తి పరిచింది.

మరోవైపు... సచిన్ పైలట్‌కు మరోసారి గెహ్లాట్ చెక్ పెట్టాడని ఈ రెండు వర్గాల మధ్య విభేదాలను ఎగదోయడానికి రాజస్థాన్‌లో ప్రతిపక్ష బీజేపీ ఇప్పటికే కామెంట్లు విసురుతోంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ నిర్ణయానికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరిని సీఎంగా ఎన్నుకున్నప్పటికీ మరో వర్గం అసంతృప్తికి లోనుకావాల్సే ఉంటుంది. ఈ విభేదాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కీలకమే. 2024 ఎన్నికలకు ముందు జరిగే రాజస్తాన్ సహా మరికొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్‌ను ప్రిఫైనల్స్‌గా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu