Sabarimala Temple: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్..

By Rajesh KarampooriFirst Published Nov 23, 2023, 2:37 AM IST
Highlights

Sabarimala : శబరిమల ఆలయానికి వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు, పతనంతిట్ట జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

Rain Alert: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల (Sabarimala Temple) ఆలయ ప్రారంభంతో భక్తుల తాకిడి ప్రారంభమైంది. శబరిమల అంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి తరలివస్తున్నారు.

మరోవైపు.. శబరిమలలో భక్తుల దర్శనాలతో పాటే భారీ వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో కేరళలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పైగా శబరిమల ఉన్న కేరళలోని పతనంతిట్ట జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

Latest Videos

మరోవైపు.. తమిళనాడు తీర ప్రాంతాలు, ఆనుకుని ఉన్న నైరుతి మధ్య పశ్చిమ బెంగాల్‌లో అల్పపీడన ద్రోణి కారణంగా రుతుపవనాల వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అప్రమత్తమైంది. పతనంతిట్ట జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది.

అలాగే మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కేరళలోని తిరువనంతపురం, ఇడుక్కి, పఠన్‌తిట్ట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కన్నూరు, కాసర్‌గోడ్‌తో పాటు మిగిలిన జిల్లాలకు కూడా ఐఎండీ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. 

సమస్య ఏంటంటే.. శబరిమల సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడం, అయ్యప్పను దర్శించుకునేందుకు పతనంతిట్ట జిల్లాలోని శబరిమలకు పలువురు భక్తులు మాలధారణ వేసుకుని వచ్చారు. కాబట్టి ఈ వర్షం భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది.  

శబరిమల అయ్యప్ప ఆలయంలో మండలం, మకరవిళక్కు పూజ కోసం 16న నడకను తెరిచారు. దీంతో భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువగా రావడంతో రద్దీని నియంత్రించేందుకు దర్శన సమయాన్ని 16 గంటలకు పెంచారు. మరోవైపు ప్రత్యేక రైళ్లు, విమానాలు అంటూ రకరకాల ప్రకటనలు కూడా చేశారు. దీంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

ఇదిలావుండగా.. వర్షం వల్ల భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ నిర్వాహకులు, పతనంతిట్ట జిల్లా యంత్రాంగం కొన్ని చర్యలు చేపట్టింది. అయితే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. కాబట్టి శబరిమల వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయ్యప్ప ఆలయానికి వెళ్లే ముందు భక్తులు సాధారణంగా పంబై నదిలో స్నానం చేస్తారు. అయితే వర్షం ఇలాగే కొనసాగితే వరదలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల జిల్లా యంత్రాంగం నది ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. 

గడిచిన 24 గంటల్లో పాలక్కాడ్ జిల్లాలోని త్రిటాల మంగళవారం 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. చిత్తూరు, పట్టాంబి (పాలక్కాడ్ జిల్లాలో), కలమస్సేరి (ఎర్నాకులం జిల్లా) 8 సెంటీమీటర్ల వర్షం పడింది. కురుదమన్నిల్ (పతనంటిట్ట జిల్లా), కున్నంకుళం (త్రిస్సూర్ జిల్లా), సీతాథోడ్ (పతనంటిట్ట జిల్లా), కున్నంకుళం (త్రిస్సూర్ జిల్లా)లలో 7 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది.  

అదేవిధంగా రానున్న 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి తమిళనాడు నుంచి శబరిమల వెళ్లే వారు తగిన సన్నాహాలతో వెళ్లాలని సూచించారు. 24 గంటల వ్యవధిలో 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే ఆరెంజ్ అలర్ట్,  6 నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.  

కర్ణాటకలో భారీ వర్షాలు 

కర్ణాటకలోని దక్షిణ లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం బెంగళూరులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో పలు చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. రానున్న రెండు రోజుల్లో మైసూరు, మాండ్య, చిక్కబళ్లాపూర్, తుమకూరు, బెంగళూరు సిటీ, బెంగళూరు రూరల్ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది.

click me!