రైల్వేలో ప్రతీ మూడు రోజులకు ఒక ఉద్యోగిపై కొరడా.. 16 నెలల్లో వందలాది మందిపై వేటు

Published : Nov 24, 2022, 01:31 PM IST
రైల్వేలో ప్రతీ మూడు రోజులకు ఒక ఉద్యోగిపై కొరడా.. 16 నెలల్లో వందలాది మందిపై వేటు

సారాంశం

రైల్వే శాఖ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు కఠినంగా అమలు చేస్తోంది. పని సరిగా చేయని..అవినీతికి పాల్పడే ఉద్యోగులపై వేటు వేస్తుంది. ఈ క్రమంలో ప్రతీ మూడు రోజులకు ఒక ఉగ్యోగిని శాశ్వతంగా తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు 139 మంది అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ పొందగా, 38 మందిని సర్వీసు నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు

రైల్వే అధికారులు, ఉద్యోగుల పని తీరు మార్చేందుకు మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. శాఖలో నిర్లక్ష్యం, అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదు స్పష్టం చేసింది. రైల్వే శాఖలో గత 16 నెలలుగా..ప్రతి మూడు రోజులకు ఒక 'అసమర్థ లేదా అవినీతి అధికారి'ని తొలగిస్తుంది. ఇప్పటి వరకు 139 మంది అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ పొందగా, 38 మందిని సర్వీసు నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు సీనియర్ గ్రేడ్ అధికారులను బుధవారం తొలగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

పలువురు రైల్వే అధికారులపై చర్యలు 

వీరిలో ఒకరు హైదరాబాద్‌లో రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డారని, మరొకరు రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ రాంచీలో పట్టుబడ్డారని తెలిపారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన పని గురించి చాలా స్పష్టంగా చెప్పారని ఒక అధికారి తెలిపారు. జూలై 2021 నుండి ప్రతి మూడు రోజులకు ఒక అవినీతి రైల్వే అధికారిని తొలగించడానికి ఇదే కారణమని తెలిపారు.

పని తీరుపై అధికారులను హెచ్చరిక 

రైల్వేస్ సిబ్బంది మరియు శిక్షణా సేవల నిబంధనలలోని రూల్ 56 (జె)ని అమలు చేసింది ప్రభుత్వం. దీని ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగిని కనీసం మూడు నెలల్లో నోటీసు ఇచ్చి తర్వాత పదవీ విరమణ చేయవచ్చు లేదా తొలగించవచ్చు. పని చేయని వారిని తొలిగించేందుకు చేపట్టిన ప్రయత్నాల్లో భాగమే ఈ చర్య. మంత్రి అశ్విని వైష్ణవ్ జూలై 2021లో రైల్వే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నుండి వీఆర్‌ఎస్ తీసుకుని, పని చేయకపోతే ఇంట్లో కూర్చోవాలని అధికారులను పదేపదే హెచ్చరించాడు.

వీఆర్‌ఎస్ తీసుకుంటున్న ఉద్యోగులు
 
బలవంతంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేయవలసి వచ్చిన లేదా తొలగించబడిన వారిలో  చాలా మంది ఎలక్ట్రికల్, సిగ్నలింగ్,మెడికల్, సివిల్ సర్వీసెస్ అధికారులు, దుకాణాలు, ట్రాఫిక్ మరియు మెకానికల్ విభాగాల ఉద్యోగులు ఉన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) కింద ఒక ఉద్యోగికి ప్రతి సంవత్సరం సర్వీస్‌కు రెండు నెలల వేతనంతో సమానమైన జీతం చెల్లిస్తారు, కానీ నిర్బంధ పదవీ విరమణలో ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉండవు.

వికలాంగ అధికారులు,ఉద్యోగులకు మాత్రమే వీఆర్ఎస్

ఫండమెంటల్ రూల్స్ ప్రకారం మరియు 1972లోని అకాల పదవీ విరమణకు సంబంధించిన నిబంధనల ప్రకారం.. FR 56(J), FR 56(L) లేదా రూల్ 48(1) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగిని పదవీ విరమణ చేయడానికి తగిన అధికారానికి సంపూర్ణ అధికారం ఉంటుంది. అవసరమైతే ప్రజా ప్రయోజనం (బి) సిసిఎస్ (పెన్షన్) రూల్స్ 1972 ప్రకారం చేయాలి. అయితే..139 మందిలో చాలా మంది అధికారులు పదోన్నతి నిరాకరించిన తర్వాత లేదా సెలవుపై పంపిన తర్వాత రాజీనామాను సమర్పించారు. VRSను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. పదవీ విరమణ కోసం ఒత్తిడి తెచ్చేలా పరిస్థితులు సృష్టించిన సందర్భాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

CM Thalapathy Vijay Grand Convoy: సీఎం విజయ్ కాన్వాయ్ చూస్తేమతిపోవాల్సిందే | Asianet News Telugu
స్పీచ్ అదరగొట్టిన తలపతి | Thalapathy Vijay Swearing-in Ceremony | Asianet News Telugu