కాశ్మీరీ పండిట్ల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి.. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ బహిరంగ లేఖ.. 

By Rajesh KarampooriFirst Published Feb 3, 2023, 10:50 PM IST
Highlights

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాశ్మీరీ పండిట్ల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ట్వీట్ ద్వారా తెలియజేశారు. 

జమ్మూ కాశ్మీర్‌లో కాశ్మీరీ పండిట్లపై జరుగుతున్న హత్యలను లక్ష్యంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. కాశ్మీరీ పండిట్లపై ప్రభుత్వ అధికారులు లోయలో పని చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ లేఖలో ఇలా వ్రాశారు, “ప్రధాని నరేంద్ర మోదీజీ.. భారత్ జోడో యాత్రలో కాశ్మీరీ పండిట్ల ప్రతినిధి బృందం నన్ను కలుసుకుని వారి విచారకరమైన పరిస్థితిని గురించి తెలిపారు.

కాశ్మీరీ పండిట్‌లు, ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని హత్యకు గురైన బాధితులను ఎలాంటి భద్రతా హామీ లేకుండా లోయలోకి వెళ్లేలా చేయడం దారుణమైన చర్య. ఈ విషయంలో మీరు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో కాశ్మీరీ పండిట్లను, ఇతరులను ఉగ్రవాదులు హతమార్చడం వల్ల లోయలో భయం, నిస్పృహ వాతావరణం ఏర్పడిందని ఆయన రాశారు. 

కశ్మీరీ పండిట్లను లోయలో పని చేయమని ప్రభుత్వ అధికారులు బలవంతం చేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో భద్రతకు గట్టి హామీ లేకుండా వారు చేయలేరు. పరిస్థితి మెరుగుపడే వరకు ప్రభుత్వం కాశ్మీరీ పండిట్ ఉద్యోగులను ఇతర అడ్మినిస్ట్రేటివ్ ,పబ్లిక్ వర్క్స్‌లో నిమగ్నం చేయగలరని కోరారు. కశ్మీరీ పండిట్‌లు తమ సొంతింటి కోసం ఎదురు చూస్తుంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా వారికి బిచ్చగాళ్ల లాంటి పదాలు వాడుతున్నారని రాహుల్‌ గాంధీ అన్నారు.

ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమని తెలిపారు. కాశ్మీరీ పండిట్‌ల డిమాండ్లను పీఎం మోదీకి తెలియజేయడానికి ప్రయత్నిస్తానని, ఈ మేరకు వారికి హామీ ఇచ్చానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాజౌరిలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసింది.కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కాశ్మీర్ నుంచి ప్రారంభమై జమ్మూ కాశ్మీర్‌లో మాత్రమే ముగిసింది.

प्रधानमंत्री जी, भारत जोड़ो यात्रा के दौरान कश्मीरी पंडितों के प्रतिनिधिमंडल ने मुझसे मिलकर अपने दुखद हालात बताए।

आतंकियों की टारगेटेड किलिंग के शिकार कश्मीरी पंडितों को बिना सुरक्षा गारंटी घाटी में जाने के लिए विवश करना निर्दयी कदम है।

आशा है, आप इस विषय में उचित कदम उठाएंगे। pic.twitter.com/1LnxDkT8i9

— Rahul Gandhi (@RahulGandhi)
click me!