Rahul Gandhi: "బుల్డోజ‌ర్లను న‌డ‌ప‌డం మానేయండి.. పవ‌ర్ ప్లాంట్ల‌ను ప్రారంభించండి": రాహుల్ గాంధీ

Published : Apr 30, 2022, 06:00 AM IST
Rahul Gandhi: "బుల్డోజ‌ర్లను న‌డ‌ప‌డం మానేయండి.. పవ‌ర్ ప్లాంట్ల‌ను ప్రారంభించండి":  రాహుల్ గాంధీ

సారాంశం

Rahul Gandhi: భారతదేశంలో కొనసాగుతున్న విద్యుత్ సంక్షోభం  నేప‌థ్యంలో మోడీ ప్రభుత్వం ద్వేషపూరిత బుల్డోజర్ల‌ను నడపడం మానేసి, దానికి బదులుగా పవర్ ప్లాంట్లను నడపడం ప్రారంభించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.  

Rahul Gandhi: భారతదేశంలో కొనసాగుతున్న విద్యుత్ సంక్షోభంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు.  మోడీ ప్రభుత్వం ద్వేషపూరిత‌ బుల్డోజర్ల‌ను నడపడం మానేసి, బదులుగా విద్యుత్ ప్లాంట్లను నడపడం ప్రారంభించాలని చుర‌క‌లు అంటించారు. మోడీ స‌ర్కార్ దేశంలో బొగ్గు, విద్యుత్ సంక్షోభం   సృష్టించిద‌నీ, కేంద్రం ప్రజల గురించి పట్టించుకుంటుందా ? లేదా? అని విమ‌ర్శించారు.  

ద్వేషం అనే బుల్‌డోజర్‌ను నడపడం మానేసి, దేశంలో పవర్ ప్లాంట్లు ప్రారంభించాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు బొగ్గు ,విద్యుత్ సంక్షోభం మొత్తం దేశంలో విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు. 

మ‌రోసారి మళ్ళీ చెబుతున్నాను - ఈ సంక్షోభం చిన్న పరిశ్రమలను నాశనం చేస్తుంది, దీని వల్ల నిరుద్యోగం మరింత పెరుగుతుంది.  రైలు, మెట్రోల‌ను ఆపడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుందని విమ‌ర్శించారు. ‘మోదీ జీ, మీకు దేశం, ప్రజల గురించి పట్టింపు లేదా’ అని ప్రశ్నిస్తూ.. ‘#BJPFailsIndia’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని వాడారు రాహుల్ గాంధీ.

 
దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు పంపిణీకి మోదీ ప్రభుత్వం లాజిస్టికల్ మద్దతు అందించడం లేదని, ఇది సంక్షోభానికి దారితీసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ఆరోపించారు. మోడీ ప్రభుత్వం తన బాధ్యత నుండి పారిపోయి దేశంలోని అన్ని సమస్యలకు రాష్ట్రాలను నిందించజాలదని ఆయన అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

African Queen Ant Smuggling: చీమల స్మగ్లింగ్ వీటితో కోట్లు సంపాదన | Asianet News Telugu
CBSE కొత్త రూల్.. పిల్లలపై భారం తప్పదా? 3 భాషలు చదవాల్సిందేనా? | Asianet News Telugu