మా ఇంటి ముందు ఏలియన్ కనిపించిందంటూ.. పూణెకి చెందిన ఓ వ్యక్తి అంటున్నారు. అనడమే కాదు.. తాను ఏలియన్ చూశానంటూ ఆయన ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ కూడా రాశారు.
మా ఇంటి ముందు ఏలియన్ కనిపించిందంటూ.. పూణెకి చెందిన ఓ వ్యక్తి అంటున్నారు. అనడమే కాదు.. తాను ఏలియన్ చూశానంటూ ఆయన ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ కూడా రాశారు. దీంతో.. ఆ లేఖను పరిశీలించిన ప్రధాన మంత్రి కార్యాలయం.. వెంటనే దానిని మహారాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు పంపించింది. దీనిపై విచారణ పట్టిన పోలీసులు కొన్ని షాకింగ్ నిజాలు తెలిశాయి.
ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసిన వ్యక్తిని పోలీసులు కొద్దిరోజుల క్రితం గుర్తించారు. అయితే.. ఆ వ్యక్తి మానసిక పరిస్థతి సరిగా లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. రెండు నెలల క్రితం ఆ వ్యక్తి ఇంటి ముందు ఉన్న చెట్టులో నుంచి ఓ వెలుగు కనపడిందట. ఆ వెలుగుని చూసి ఏలియన్ వచ్చిందని అతను భావించి.. వెంటనే పీఎంవోకి లేఖ రాశారు.
అతను అలా పీఎంవోకి లేఖ రాసిన విషయం కనీసం అతని కుటుంబసభ్యులకు కూడా తెలియకపోవడం గమనార్హం. పోలీసులు దర్యాప్తు చేపట్టే సరికి ఈ సంఘటన అందరికీ తెలిసి వైరల్ గా మారింది.