పుల్వామా ఉగ్రదాడి: పాక్‌కు నదీ జలాలు కట్ చేసిన భారత్

By Siva KodatiFirst Published Feb 21, 2019, 8:11 PM IST
Highlights

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ను అన్ని వైపుల నుంచి దిగ్బంధిస్తున్న భారత్.. వ్యూహాత్మకంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ మీదుగా పాక్‌కు వెళ్లే సింధూనది జలాలను నిలిపివేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ను అన్ని వైపుల నుంచి దిగ్బంధిస్తున్న భారత్.. వ్యూహాత్మకంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ మీదుగా పాక్‌కు వెళ్లే సింధూనది జలాలను నిలిపివేసింది.

ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ‘‘సింధూ నది’’ జలాల విషయంలో మన దేశ వాటా నీటిని పాకిస్తాన్‌కు వెళ్లనీయకుండా ప్రధాని నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.

ఆ నీటిని తూర్పు నదుల్లోంచి మళ్లించి, జమ్మూకశ్మీర్, పంజాబ్‌లోని ప్రజలకు అందిస్తామన్నారు. రావి నదిపై షాపూర్-కాందీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని...యూజీహెచ్ ప్రాజెక్ట్ ప్రాంతంలో మన వాటా నీళ్ళని నిల్వ చేసి, కశ్మీర్‌కు అందిస్తామన్నారు.

అలాగే, మిగులు జలాలను రావి-బియాస్ లింక్ ద్వారా పరివాహక ప్రాంతాలకు అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్‌లను జాతీయ ప్రాజెక్ట్‌లుగా ప్రకటిస్తున్నామని గడ్కరీ వెల్లడించారు.

1960లో సింధూ నది ఒప్పందం ప్రకారం సింధు బేసిన్‌లోని ఆరు నదుల నీటిని ఎలా వినియోగించుకోవాలనే దానిపై భారత్, పాక్ అప్పట్లో సర్దుబాటు చేసుకున్నాయి.

ఈ ఆరింటిలో మూడు నదులపై భారత్‌కు, మూడు నదులపై పాకిస్తాన్‌‌కు హక్కులు ఉన్నాయి. దీని ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు, జీలం, చీనాబ్, సింధు నదులపై పాక్‌కు హక్కులు ఉన్నాయి. 

 

Under the leadership of Hon'ble PM Sri ji, Our Govt. has decided to stop our share of water which used to flow to Pakistan. We will divert water from Eastern rivers and supply it to our people in Jammu and Kashmir and Punjab.

— Nitin Gadkari (@nitin_gadkari)
click me!