మిషన్ దివ్యాస్త్ర ... సరికొత్త టెక్నాలజీతో అగ్ని-5 మిస్సైల్ రెడీ : ప్రధాని మోదీ కీలక ప్రకటన

Published : Mar 11, 2024, 05:48 PM ISTUpdated : Mar 11, 2024, 06:17 PM IST
మిషన్ దివ్యాస్త్ర ... సరికొత్త టెక్నాలజీతో అగ్ని-5 మిస్సైల్ రెడీ : ప్రధాని మోదీ కీలక ప్రకటన

సారాంశం

దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికన కీలక ప్రకటన చేసారు. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రకటనకు సంబంధించి ప్రధాని ట్వీట్ చేసారు. 

న్యూడిల్లీ : పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసారు. డిఆర్డివో శాస్త్రవేత్తలు మిషన్ దివ్యాస్త్రను రూపొందించినట్లు ప్రధాని ప్రకటించారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్ (MIRV) టెక్నాలజీతో దేశీయంగానే అగ్ని-5 మిస్సైల్ ను రూపొందించినట్లు ప్రధాని ట్వీట్ చేసారు. 

ఇవాళ(సోమవారం) అగ్ని-5 మిస్సైల్ ను శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రధాని మోదీ దీనిపై ప్రకటన చేసినట్లుగా సమాచారం. దేశీయ టెక్నాలజీతో రూపొందించిన ఈ అగ్ని -5 క్షిపణిని వాయుమార్గం ద్వారా ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ మిస్సైల్ తో ఏకకాలంలో వివిధ లక్ష్యాలను చేధించవచ్చని తెలుస్తోంది.  

డిఆర్డివో (డిఫెన్స్ రీసెర్చ్ ఆండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) ఈ అగ్ని 5 క్షిపణిని రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఓ మహిళా శాస్త్రవేత్త వున్నట్లు తెలుస్తోంది. అనేక మంది మహిళలు ఈ ప్రాజెక్ట్ లో పనిచేసినట్లు సమాచారం. 

 మిషన్ దివ్యాస్త్ర ద్వారా రూపొందించిన అగ్ని-5 క్షిపణి చాలా ప్రత్యేకమైనదిగా తెలుస్తోంది. ఈ క్షిపణి రూపకల్పన ద్వారా ఇండియా మల్టిపుల్ ఇండడిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్ (ఎంఐఆర్వి) టెక్నాలజీ కలిగిన దేశాల సరసన చేసింది. ఈ మిస్సైల్ ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కావడమే కాదు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో దేశం మరో ముందడుగు వేసింది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu