PM Modi: 'మేరా యువ భారత్ పోర్టల్'ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఏమన్నారంటే..?

Published : Oct 31, 2023, 11:07 PM IST
PM Modi: 'మేరా యువ భారత్ పోర్టల్'ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఏమన్నారంటే..?

సారాంశం

Prime Minister Narendra Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ 'మేరా యువ భారత్ పోర్టల్'ను ప్రారంభించారు. మేరీ మాతీ మేరా దేశ్-అమృత్ కలష్ యాత్ర ముగింపు కార్యక్రమంలో పోర్ట‌ల్ ను ప్రారంభించిన త‌ర్వాత ప్ర‌ధాని మాట్లాడుతూ మ‌న‌ ఉద్దేశాలు మంచివైతే, మొదట జాతి భావన ప్రధానమైనప్పుడు, ఫలితాలు ఉత్తమంగా ఉంటాయని చెప్పారు.  

PM Modi launches 'Mera Yuva Bharat Portal': దేశ రాజ‌ధాని ఢిల్లీలో మేరీ మాతీ మేరా దేశ్-అమృత్ కలష్ యాత్ర ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ 'మేరా యువ భారత్ పోర్టల్'ను వర్చువల్ గా ప్రారంభించారు. 'మాతీ మేరా దేశ్' ప్రచారం ముగింపు సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్య మార్గంలో జరిగిన అమృత్ కలశానికి ప్రధాని మట్టిని సమర్పించారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా దేశం రాజ్ పథ్ నుంచి కర్తవ్య మార్గం వరకు ప్రయాణించిందని ప్రధాని తెలిపారు. ''సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కర్తవ్య మార్గంలో చారిత్రాత్మక 'మహాయజ్ఞం'ను చూస్తున్నారు. దండి యాత్రకు ప్రజలు ఏకమైనట్లే, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రజల భాగస్వామ్యంతో కొత్త చరిత్రను సృష్టించింది" అని మేరీ మాతీ మేరా దేశ్-అమృత్ కలష్ యాత్ర ముగింపు కార్యక్రమంలో ప్రధాని అన్నారు.

ఈ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా తాము 'రాజ్ పథ్' నుంచి 'కర్తవ్య మార్గం' వరకు ప్రయాణించామని  ప్ర‌ధాని అన్నారు. ''నేడు 'కర్తవ్య పథ్' వద్ద 'ఆజాద్ హింద్ సర్కార్' తొలి ప్రధాన విగ్రహం ఉంది. ఇప్పుడు మన నావికాదళం ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో అండమాన్ నికోబార్ దీవులకు స్వదేశీ పేర్లు వచ్చాయి. ఈ కాలంలోనే 'జనతా గౌరవ్ దివస్', 'వీర్ బాల్ దివస్' ప్రకటించారు. దేశం నుంచి వలసవాద మనస్తత్వం తరిమికొట్టాం' అని ప్రధాని మోడీ అన్నారు.

అమృత్ కలష్ అంటే ఏమిటి?

అమృత్ కలశంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టి ఉంటుంది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ముగింపు, దేశంలోని యువత కోసం 'మేరా యువ భారత్' (ఎంవై భారత్) వేదికను ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. శ్రీనగర్ నుంచి తిరునల్వేలి వరకు, సిక్కిం నుంచి సూరత్ వరకు భారత్ లోని రంగులు, నేలలు సోమవారం కర్తవ్య మార్గంలో కలిసిపోయాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరించి బౌలేవార్డ్ వద్ద 'మేరీ మాతీ మేరా దేశ్' ప్రచారాన్ని జరుపుకున్నారు.

ఇళ్లు, సంస్థాగత మైదానాలు, బహిరంగ ప్రదేశాల ఇలా దేశంలోని అనేక  ప్రాంతాల నుంచి సేకరించిన మట్టితో అమృత్ కలశాన్ని మోస్తూ, వందలాది మంది యాత్రికులు చిన్న, పెద్ద బ్లాకుల నుంచి వచ్చి భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ భారతదేశ సాంస్కృతిక ఉజ్వలతను చాటుకున్నారు. విజయ్ చౌక్, కర్తవ్య పథ్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో 700కు పైగా జిల్లాల నుంచి వేలాది బ్లాకులకు చెందిన అమృత్ కలష్ యాత్రికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, అర్జున్ రామ్ మేఘ్వాల్, అనురాగ్ ఠాకూర్, మీనాక్షి లేఖి తదితరులు పాల్గొన్నారు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇది చావు కాదు స్వ‌ర్గం.. క‌న్న త‌ల్లిదండ్రులే బిడ్డ మ‌ర‌ణాన్ని కోరిన క్ష‌ణం. క‌థ చ‌దివితే క‌న్నీరు ఆగ‌దు
Raghav Chadha Slams: మినిమం బ్యాలెన్స్ లేదని 19వేల కోట్ల ఫైన్ వసూలు | Balence | Asianet News Telugu