పేదరికంపై భారత్‌ టెక్నాలజీని ఆయుధంగా ఉపయోగిస్తోందన్న ప్రధాని మోడీ

Published : Nov 16, 2022, 01:52 PM IST
పేదరికంపై భారత్‌ టెక్నాలజీని ఆయుధంగా ఉపయోగిస్తోందన్న ప్రధాని మోడీ

సారాంశం

Bangalore: భారతదేశ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో బెంగళూరు అగ్రస్థానాన్ని హైలైట్ చేస్తూ, ప్రధాని మోడీ నగరాన్ని సాంకేతికత, ఆలోచనా నాయకత్వానికి నిలయంగా పేర్కొన్నారు. పేదరికంపై భారత్‌ టెక్నాలజీని ఆయుధంగా ఉపయోగిస్తోందని ఆయన తెలిపారు.  

Technology - Poverty: భారతదేశ సాంకేతికత - ఆవిష్కరణలు ఇప్పటికే ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి.. అయితే వినూత్న, పెరుగుతున్న టెక్ యాక్సెస్ కారణంగా యువత భవిష్యత్తు చాలా పెద్దదిగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు టెక్ సమ్మిట్‌లో ముందుగా రికార్డ్ చేసిన వీడియో సందేశం ద్వారా పేర్కొన్నారు. భారతదేశ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో బెంగళూరు అగ్రస్థానాన్ని హైలైట్ చేస్తూ, ప్రధాని మోడీ నగరాన్ని సాంకేతికత-ఆలోచనా నాయకత్వానికి నిలయమని పేర్కొన్నారు. "చాలా కాలంగా, సాంకేతికత ప్రత్యేకమైన డొమైన్‌గా చూడబడింది. ఇది ఉన్నతమైన-శక్తిమంతులకు మాత్రమే అని చెప్పబడింది. కానీ టెక్నాలజీని ఎలా ప్రజాస్వామ్యీకరించాలో భారతదేశం ప్రపంచానికి చూపించింది. సాంకేతికతను మానవ స్పర్శను ఎలా అందించాలో కూడా భారతదేశం చూపించింది. భారతదేశంలో, సాంకేతికత సమానత్వం..సాధికారత శక్తి” అని ప్రధాని మోడీ అన్నారు. 

 

పేదరికం వంటి అనేక సమస్యలను ఎదుర్కొవడానికి భారత్ టెక్నాలజీని ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నదని తెలిపారు. ''పేదరికంపై పోరులో భారత్ టెక్నాలజీని ఆయుధంగా ఉపయోగిస్తోంది. స్వామిత్వ పథకం కింద డ్రోన్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూముల మ్యాప్‌లు వేస్తున్నాం. అనంతరం ప్రజలకు ఆస్తి కార్డులు అందజేస్తారు. దీంతో భూ వివాదాలు తగ్గుతాయి. ఇది పేదలకు ఆర్థిక సేవలు, క్రెడిట్‌ని పొందడంలో కూడా సహాయపడుతుంది'' అని ప్రధాని మోడీ అన్నారు. రెడ్ టాపిజమ్‌కు భారతదేశం ఇప్పుడు పేరుగాంచిన ప్రదేశం కాదనీ, పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేస్తుందని ప్రధాని నొక్కి చెప్పారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 2015లో 81వ ర్యాంక్‌లో ఉన్న భారత్‌ ఈ ఏడాది 40వ ర్యాంక్‌కు చేరుకుందని ఆయన తెలియజేశారు.

"ఎఫ్‌డీఐ సంస్కరణలు, లేదా డ్రోన్ నిబంధనల సరళీకరణ, సెమీ కండక్టర్ రంగంలో ముందడుగులు, వివిధ రంగాలలో ఉత్పత్తి ప్రోత్సాహక పథకాలు లేదా వ్యాపారం చేయడంలో సౌలభ్యం పెరగడం వంటివి భారతదేశానికి అనేక అద్భుతమైన అంశాలు కలిసి వస్తున్నాయి" అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. "మీ పెట్టుబడి, మా ఆవిష్కరణ అద్భుతాలు చేయగలవు. మీ ట్రస్ట్, మా సాంకేతిక నైపుణ్యం అన్ని విషయాలు జరిగేలా చేయగలవు. ప్రపంచాన్ని దాని సమస్యలను పరిష్కరించడంలో మేము నాయకత్వం వహిస్తున్నప్పుడు మాతో కలిసి పనిచేయమని నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను" అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు. 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తి ఆస్తి ల‌క్ష‌రాల రూ. 3 వేల కోట్లు.. ఇంత‌కీ ఎందుకిలా మారాడంటే