గత ప్రభుత్వాలు ప్రజలకు కలలను అమ్మేశాయి: ప్ర‌తిప‌క్షాల‌పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్

Published : Aug 10, 2023, 03:34 PM IST
గత ప్రభుత్వాలు ప్రజలకు కలలను అమ్మేశాయి:  ప్ర‌తిప‌క్షాల‌పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్

సారాంశం

Lok Sabha: ''2013లో మోర్గాన్ స్టాన్లీ భారత్ ను ప్రపంచంలోని ఐదు బలహీనమైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో చేర్చింది. భారత్ ను బలహీనమైన ఆర్థిక వ్యవస్థగా పేర్కొంది. నేడు అదే మోర్గాన్ స్టాన్లీ భారత్ ను అప్ గ్రేడ్ చేసి అధిక రేటింగ్ ఇచ్చింది. కేవలం 9 సంవత్సరాలలో, మన ప్రభుత్వ విధానాల కారణంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందింది. కోవిడ్ తో సంబంధం లేకుండా ఆర్థిక అభివృద్ధిని చూసింది. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనది'' అని నిర్మలా సీతారామన్ అన్నారు.  

Union Finance Minister Nirmala Sitharaman: లోక్ స‌భ‌లో అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్డీఏ రిపోర్ట్ కార్డును ప్రవేశపెట్టి, భారత్ ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని పేర్కొన్నారు. కోవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌భావం ఉన్నప్పటికీ మన ప్రభుత్వ విధానాల కారణంగా 9 సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిందనీ, ఆర్థిక అభివృద్ధిని చూశామని నిర్మలా సీతారామన్ అన్నారు. ''2013లో మోర్గాన్ స్టాన్లీ భారత్ ను ప్రపంచంలోని ఐదు బలహీనమైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో చేర్చింది. భారత్ ను బలహీనమైన ఆర్థిక వ్యవస్థగా ప్రకటించారు. నేడు అదే మోర్గాన్ స్టాన్లీ భారత్ ను అప్ గ్రేడ్ చేసి అధిక రేటింగ్ ఇచ్చింది. కేవలం 9 సంవత్సరాలలో, మన ప్రభుత్వ విధానాల కారణంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందింది. కోవిడ్ తో సంబంధం లేకుండా ఆర్థిక అభివృద్ధిని చూసింది. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనది'' అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

భారతదేశం తన భవిష్యత్తు వృద్ధి గురించి ఆశాజనకంగా, సానుకూలంగా ఉన్న అరుదైన స్థితిలో ఉందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే గ‌త ప్ర‌భుత్వాలు, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. యూపీఏ కలలను మాత్రమే అమ్ముకుంటోందనీ, కానీ ఎన్డీయే వాటన్నింటినీ సాకారం చేస్తోందన్నారు. "పరివర్తన అనేది వాస్తవ డెలివరీ ద్వారా వస్తుంది, మాట్లాడే మాటల ద్వారా కాదు. మీరు ప్రజలకు కలలు చూపిస్తారు. మేము కలలను సాకారం చేస్తాం. అందరికీ సాధికారత కల్పించడం పై దృష్టి పెట్టాము. నమ్మకం ముందుకు సాగుతున్నాం. మా డీబీటీ కథ మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. డీబీటీని యూపీఏ అమలు చేసినప్పటికీ 2013-14లో రూ.7,367 కోట్లు మాత్రమే బదిలీ అయ్యాయి. ఆ మొత్తం నుంచి 2014-15 నాటికి డీబీటీ బదిలీలు 5 రెట్లు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో డీబీటీ ద్వారా రూ.7.16 లక్షల కోట్లు బదిలీ చేశామని'' తెలిపారు.

యూపీఏ కలలు అమ్ముకుంటుంది, కానీ ఎన్డీయే వాటన్నింటినీ సాకారం చేసుకుందని నిర్మలా సీతారామన్ అన్నారు.  అధిక ద్రవ్యోల్బణం, మందగమన వృద్ధి అనే రెండు సవాళ్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పోరాడుతున్నప్పుడు భారతదేశం తన భవిష్యత్తు వృద్ధి గురించి ఆశాజనకంగా, సానుకూలంగా ఉన్న ప్రత్యేక స్థానంలో ఉందని తెలిపారు. గత యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు తన పాలనను ప్రస్తావిస్తూ దశాబ్దాన్ని వృథా చేసిందని ఆరోపించారు. 2022లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కేవలం మూడు శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. 2023 నాటికి ఇది 2.1 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు చెప్పిందన్నారు. అమెరికా, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలు, యూరో జోన్ సవాళ్లను ఎదుర్కొంటున్నాయనీ, చైనా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా వినియోగదారుల డిమాండ్, వేతన స్తబ్దతకు సంబంధించిన సొంత సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ అన్నారు.

PREV
click me!

Recommended Stories

దేశ చరిత్రలో సంచలనం.. 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించిన కోర్టు. అస‌లేం జ‌రిగిందంటే?
African Queen Ant Smuggling: చీమల స్మగ్లింగ్ వీటితో కోట్లు సంపాదన | Asianet News Telugu