గత ప్రభుత్వాలు కుల, మతాలను సమస్యలుగా మార్చాయి.. మేము అభివృద్ధిని తీసుకొచ్చాం: కర్ణాటకలో ప్రధాని మోడీ

By Mahesh RajamoniFirst Published Jan 19, 2023, 2:46 PM IST
Highlights

Bangalore: గత ప్రభుత్వాలు కుల, మతాలను సమస్యగా మార్చాయ‌ని ఆరోపించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, త‌మ పాల‌న దేశంలో అభివృద్ధిని తీసుకొచ్చింద‌ని చెప్పారు. క‌ర్ణాట‌క‌లోని యాదగిరి సహా దేశంలోని 100కు పైగా జిల్లాల్లో ఆకాంక్షాత్మక జిల్లా కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఆయా జిల్లాల్లో సుపరిపాలన అందించామనీ, అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
 

PM Modi Karnataka Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది.  ఈరోజు (గురువారం-జనవరి 19) రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలోని నారాయణపూర్ ఎడమ గట్టు కాలువ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. అమృతకాల స‌మ‌యంలో అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కి చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం, ప్రతి రాష్ట్రం ఈ ప్రచారానికి సహకరించినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గత ప్రభుత్వాలు కుల, మతాలను సమస్యగా మార్చాయ‌ని ఆరోపించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, త‌మ పాల‌న దేశంలో అభివృద్ధిని తీసుకొచ్చింద‌ని చెప్పారు. క‌ర్ణాట‌క‌లోని యాదగిరి సహా దేశంలోని 100కు పైగా జిల్లాల్లో ఆకాంక్షాత్మక జిల్లా కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఆయా జిల్లాల్లో సుపరిపాలన అందించామనీ, అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

అంద‌రి జీవితాలు బాగుంటేనే దేశ అభివృద్ది.. ! 

పొలంలో పనిచేసే రైతు, పరిశ్రమల్లో పనిచేసే కూలీలు స‌హా దేశ ప్ర‌జ‌లంద‌రీ జీవితాలు బాగుంటేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని  ప్ర‌ధాని మోడీ అన్నారు. యాదగిరితో సహా దేశంలోని 100 కంటే ఎక్కువ జిల్లాల్లో మా ప్రభుత్వం ఆకాంక్ష జిల్లా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మేము ఈ జిల్లాలలో సుపరిపాలనను అందిస్తున్నామ‌ని ప్ర‌ధాని నొక్కిచెప్పారు. ప్రతి స్థాయిలో అభివృద్ధి పనులను ప్రారంభించామని అన్నారు.  

నీటి భద్రత గురించి ప్ర‌స్తావించిన ప్ర‌ధాని.. 

భారతదేశం అభివృద్ధి చెందాలంటే సరిహద్దు భద్రత, తీర భద్రత, అంతర్గత భద్రత వంటి నీటి భద్రతకు సంబంధించిన సవాళ్లను కూడా అంతం చేయాలని ప్రధాని మోడీ అన్నారు. జల్ జీవన్ మిషన్ కింద ఇప్పుడు యాదగిరి ప్రజలందరికీ తాగునీరు, ఇంటింటికీ నీరు అందుతుందని చెప్పారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల నీటి క‌ష్టాలు తొల‌గిపోయాయ‌ని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు..

క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. గత ప్రభుత్వాలు కులం, మతం, ఇతర ఎన్నికల అంశాలపై దృష్టి సారించాయని కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాలు కాదనీ, అభివృద్ధే మా ప్రాధాన్యత అని అన్నారు. యాదగిరి సుసంపన్నమైన సంస్కృతిని కాపాడుతుందనీ, గత ప్రభుత్వాలు వెనుకబడిన జిల్లాలను ప‌ట్టించుకోలేద‌నీ, తాము అభివృద్ధి చేసి సుపరిపాలన తీసుకొచ్చామని ఆయన చెప్పారు.

'డబుల్ ఇంజన్ అంటే డబుల్ సంక్షేమం'

హర్ ఘర్ జల్ అభియాన్ కూడా ప్రభుత్వం రెట్టింపు ప్రయోజనాలకు ఉదాహరణ అని ప్రధాని అన్నారు. డబుల్ ఇంజన్ అంటే డబుల్ సంక్షేమం, డబుల్ ర్యాపిడ్ డెవలప్ మెంట్ అని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలోనూ మన ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. చిన్న రైతులకు రుణ కార్డులు ఇచ్చామ‌ని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సాయం చేస్తున్నాయన్నారు. వారి కోసం మ‌రిన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌న్నారు. 

 

Elated to be in Yadgiri. Projects pertaining to water security, farmer welfare & connectivity are being launched, which will significantly benefit the region. https://t.co/jJFYGkrNSu

— Narendra Modi (@narendramodi)

 

 

click me!