కుంభమేళాలో డ్రోన్ షో: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం

Published : Jan 25, 2025, 10:17 PM IST
కుంభమేళాలో డ్రోన్ షో: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం

సారాంశం

కుంభమేళాలో జరిగిన డ్రోన్ షో భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. సాగరమథనం, శివుడు విషం తాగడం, అమృత కలశం వంటి దృశ్యాలు ఆకాశంలో అద్భుతంగా కనిపించాయి. సాంకేతికత, సంస్కృతి కలగలిసిన ఈ అపురూప దృశ్యాన్ని చూడాల్సిందే.

మహాకుంభ్ నగర్ : ఈసారి మహా కుంభమేళా కొత్త అనుభూతినిస్తోంది. ఇందులో పాల్గొన్న భక్తులు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఆధునిక సాంకేతికత కూడా చూడొచ్చు. జనవరి 24, 25, 26 తేదీల్లో జరిగిన డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు అద్దం పడుతున్న ఈ షో అద్భుతం.

గణతంత్ర దినోత్సవం నాడు పర్యాటక శాఖ సెక్టార్-7లో ఈ డ్రోన్ షో నిర్వహించింది. సాంకేతికంగా ఇది గొప్ప విజయం. డ్రోన్‌లతో ఆకాశంలో సముద్ర మథనం, విషం తాగుతున్న శివుడు, అమృతం తాగుతున్న దేవతలు, మహాకుంభ్ దృశ్యాలు కనువిందు చేశాయి. ఈ అద్భుత దృశ్యంలో సంగీతం, లైటింగ్ అదుర్స్.

 శంఖారావంతో ప్రారంభం

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జయవీర్ సింగ్ శంఖారావంతో ఈ డ్రోన్ షోను ప్రారంభించారు. ఆకాశంలో సముద్ర మథనం గాథ కళ్లకు కట్టినట్టు కనిపించింది. దేవతలు అమృతం తాగుతున్న దృశ్యం అద్భుతం.

ఉత్తరప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించే దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్రోన్‌లతో మహాకుంభ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ లోగోలను ఆకాశంలో చిత్రించారు. జాతీయ జెండా, శంఖం ఊదుతున్న సాధువు, సంగమంలో స్నానం చేస్తున్న సన్యాసి దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశభక్తి, మహాకుంభ్ పవిత్రతను ఈ దృశ్యాలు చాటాయి.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

షో సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. స్థానిక అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ డ్రోన్ షో మహాకుంభ్ వైభవానికి ప్రతీకగా నిలిచింది. భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక సాంకేతికత, భారతీయ సంస్కృతి కలయికను చూపించింది.

 

PREV
click me!

Recommended Stories

Budget 2026–27 | Nirmala Sitaraman on Imports & Exports | Custom Process | Asianet News Telugu
PM Modi : మే తర్వాత మోదీ రాజీనామా? తర్వాతి పీఎం ఎవరు? ప్రముఖ జ్యోతిష్కుని సంచలన జోస్యం !