ప్రయాగరాజ్ కుంభమేళా ప్రాంతమంతా జీరో యానిమల్ జోన్ ... అటే ఏమిటో తెలుసా?

Published : Oct 26, 2024, 03:09 PM IST
ప్రయాగరాజ్ కుంభమేళా ప్రాంతమంతా జీరో యానిమల్ జోన్ ...  అటే ఏమిటో తెలుసా?

సారాంశం

ప్రయాగరాజ్ మహా కుంభంలో భక్తుల సౌకర్యం కోసం జీరో జంతువుల జోన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఏమిటో తెలుసా?

ప్రయాగరాజ్ : వచ్చేఏడాది 2025 జనవరిలో ప్రయాగరాజ్‌ జనసంద్రంగా మారనుంది. ఇక్కడ జరిగే మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్లకు పైగా భక్తులు, పర్యాటకులు హాజరవుతారని అంచనా. ఈ మహత్తర కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు అధికారులు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కుంభమేళా ప్రాంతాన్ని జీరో జంతువుల జోన్‌గా మార్చాలని నిర్ణయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేళా ప్రాంతం నుండి అన్ని జంతువులను దూరంగా ఉంచేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించారు.

24 గంటల నిరంతర పర్యవేక్షణ

మహా కుంభమేళా ప్రాంతంలో తొలిసారిగా జీరో జంతువుల జోన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మహా కుంభమేళా జరిగే ప్రాంతమంతా జంతువుల కార్యకలాపాల నుండి విముక్తి పొందుతుందని ప్రయాగరాజ్ నగరపాలక సంస్థ పశువైద్య, సంక్షేమ అధికారి విజయ్ అమృత్ రాజ్ తెలిపారు. సంగమ ప్రాంతంతో పాటు నైనీ, జున్సీ, సివిల్ లైన్స్ ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని పెద్ద, చిన్న జంతువుల కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు. పెద్ద జంతువులను కుంభమేళా ప్రాంతం నుండి బయటకు తరలించేందుకు నగరపాలక సంస్థ ఇప్పటినుండే ప్రచారం చేపడుతోంది. ఈ సమయంలో ఎలాంటి జంతువులను రోడ్లపై వదలకూడదని పశువుల కాపరులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

కుక్కలు, పిల్లుల వంటి చిన్న జంతువుల కోసం 5 షెడ్లను నిర్మిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్‌లో 2, నైనీ, జున్సీ, ఫాఫామావ్‌లలో ఒక్కో చిన్న జంతువుల షెడ్‌ను నిర్మిస్తారు. ఈ షెడ్లలోనే చిన్న జంతువులను ఉంచుతారు. వాటికి ఆహారం, నీటి ఏర్పాట్లు చేస్తారు.

కుంభమేళా ప్రాంతంతో పాటు నగరంలోని అన్ని ప్రధాన మార్గాలను పెద్ద జంతువుల కార్యకలాపాల నుండి విముక్తి చేస్తారు. మీర్జాపూర్ మార్గం, రీవా రోడ్, లక్నో మార్గం, కాన్పూర్ రోడ్, చిత్రకూట్ మార్గంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. దారాగంజ్ నుండి ఫాఫామావ్ వరకు నిర్మిస్తున్న రివర్ ఫ్రంట్ చుట్టుపక్కల ఉన్న డెయిరీల యజమానులను జంతువులను తరలించాలని లేదా నగరం వెలుపల తీసుకెళ్లాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రివర్ ఫ్రంట్ చుట్టుపక్కల 5 డెయిరీలపై చర్యలు తీసుకుని వాటిని ప్రాంతం నుండి తరలించారు.

జీరో యానిమల్ జోన్ ప్రణాళికను అమలు చేసేందుకు పశుసంక్షేమ శాఖ 12 బృందాలను ఏర్పాటు చేసింది. పెద్ద జంతువులను ఈ జోన్ నుండి బయటకు తరలించేందుకు 7 బృందాలను ఏర్పాటు చేశామని నగరపాలక సంస్థ పశుసంక్షేమ అధికారి తెలిపారు. ప్రతి బృందంలో నలుగురు సభ్యులు ఉంటారు. చిన్న జంతువుల కోసం 5 బృందాలను ఏర్పాటు చేశారు. వీరు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన జంతు షెడ్లలో ఉంటారు. అవసరమైతే మరిన్ని బృందాలను ఏర్పాటు చేస్తామని. 2025 జనవరి నుండి 31 మార్చి 2025 వరకు ఈ ఏర్పాట్లు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu