
నటుడు Prakash Raj ప్రధాన మంత్రి Narendra Modiపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ social media వేదికగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ఓ సమావేశంలో చంద్రకాంత్ పాటిల్ ప్రధాని మోదీ రెండు గంటలే నిద్రపోతారని, ఒక రోజులో 22 గంటలపాటు ఆయన పనిచేస్తుంటారని అన్న వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సెటైరికల్ గా స్పందించాడు.
ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ‘దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి. నిద్రలేకపోవడం అనేది ఓ జబ్బు, వైద్య పరిభాషలో దీన్ని ఇన్సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి. అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకాష్ రాజ్ ప్రదాని మోదీ, బీజేపీ నేతల మీద విమర్శలు గుప్పిస్తుంటాడనే విషయం తెలిసిందే.