ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పేలిన పవర్ బ్యాంక్.. మహిళ అరెస్ట్

Published : Aug 30, 2018, 12:58 PM ISTUpdated : Sep 09, 2018, 01:19 PM IST
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పేలిన పవర్ బ్యాంక్.. మహిళ అరెస్ట్

సారాంశం

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పవర్ బ్యాంక్ పేలడంతో నిన్న కలకలం రేగింది. ఢిల్లీలోని ఢిఫెన్స్ కాలనీకి చెందిన మాళవిక తివారీ అనే మహిళ నిన్న ఉదయం స్పైస్‌జెట్ విమానంలో ధర్మశాలకు వెళ్లాల్సి ఉంది

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పవర్ బ్యాంక్ పేలడంతో నిన్న కలకలం రేగింది. ఢిల్లీలోని ఢిఫెన్స్ కాలనీకి చెందిన మాళవిక తివారీ అనే మహిళ నిన్న ఉదయం స్పైస్‌జెట్ విమానంలో ధర్మశాలకు వెళ్లాల్సి ఉంది. అయితే చెకింగ్ సమయంలో భద్రతా సిబ్బంది ఆమె బ్యాగును పరిశీలించారు. ఈ క్రమంలో ఏదో ఒక వస్తువు అనుమానాస్పదంగా కనిపించడంతో దానిని బయటకు తీశారు.

తీరా చూస్తే అది పవర్ బ్యాంకు.. భద్రతా కారణాల రీత్యా ఇలాంటి వస్తువులకు అనుమతి లేదని సిబ్బంది అభ్యంతరం తెలపడంతో ఆమె వారితో వాగ్వివాదానికి దిగింది. ఈ సమయంలో సహనం కోల్పోయిన మాళవిక పవర్ బ్యాంక్ తీసి గోడకు విసిరికొట్టింది.. దీంతో అది ఒక్కసారిగా పేలిపోయింది.

ఈ సంఘటనతో ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళ వాతావరణం నెలకొని, ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విమానాశ్రయ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన నేరంపై మాళవికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Supreme Court On Protests: పోలీసు లాఠీలకు సుప్రీం బ్రేక్.. ఆందోళనలు చేస్తే కొడతారా?.. సీజేఐ సూర్యకాంత్
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !