రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం: ఫేస్‌బుక్‌లో ఫోటోలు షేర్ చేసిన మోడీ

Published : Jul 15, 2021, 04:20 PM IST
రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం: ఫేస్‌బుక్‌లో ఫోటోలు షేర్ చేసిన మోడీ

సారాంశం

వారణాసిలో రుద్రాక్ష్ పేరుతో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ ను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు ప్రారంభించారు. వారణాసిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుద్రాక్ష్ సెంటర్ ఫోటోలను ఫేస్ బుక్ లో ఆయన  పోస్టు చేశారు.   

వారణాసి: రుద్రాక్ష్ పేరుతో పిలవబడే అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు ప్రారంభించారు. ఈ కన్వెన్షన్ సెంటర్  ఈ ప్రాంతానికి చెందిన సాంస్కృతిక గొప్పతనాన్ని చూపుతోంది.తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్  సమావేశాలకు ఆకర్షణీయంగా మారుస్తోందన్నారు. ఈ భవనానికి చెందిన ఏరియల్ షాట్లను ప్రధాని మోడీ తన ఫేస్ బుక్ ఖాతాలో  షేర్ చేశాడు.

also read:కరోనా కట్టడిలో యూపీ సర్కార్ పనితీరు అసమానమైంది: వారణాసిలో మోడీ

ఈ కన్వెన్షన్ సెంటర్ లో 108 రుద్రాక్షలు ఏర్పాటు చేశారు.  దీని పై కప్పు శివలింగాన్ని పోలి ఉంటుంది. ఎల్‌ఈడీ లైట్లను ఈ భవనంలో అమర్చారు. ఏడేళ్లుగా కాశీ ఏడేళ్లుగా అనేక అభివృద్ది కార్యక్రమాలతో అలంకరించబడిందన్నారు. రుద్రాక్ష లేకుండా ఈ అలంకారాన్ని ఎలా పూర్తి చేయవచ్చని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కాశీ ఈ రుద్రాక్షను ధరించడంతో  కాశీ అభివృద్ది మరింత ప్రకాశిస్తోందన్నారు మోడీ.ఈ సందర్భంగా జపాన్ ప్రధానిని షింజో అబేను ఆయన గుర్తు చేసుకొన్నారు. కాశీకి షింజో వచ్చిన సమయంలో  రుద్రాక్ష్ ఆలోచన గురించి చర్చించినట్టుగా మోడీ ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుపై పనిచేయాలని  ఆయన తన  అధికారులను ఆదేశించారని మోడీ తెలిపారు.

సిగ్రాలో  2.87 హెక్టార్ల భూమిలో రెండంతస్థుల్లో 1200 మంది కూర్చొనే సామర్ధ్యంతో ఈ భవనాన్ని నిర్మించారు.ఈ కన్వెన్షన్ సెంటర్ ద్వారా సామాజిక, సాంస్కృతిక పరస్పర చర్యలకు అవకాశాలు కల్పించడమే ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.  పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు కూడ ఈ సెటర్ దోహదపడుతుందని అధికారులు చెప్పారు.

అంతర్జాతీయ సమావేశాలు, ప్రదర్శనలు, సంగీత కచేరీలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించడానికి ఇది అనువైందని అధికారులు తెలిపారు. ఈ గ్యాలరీలో వారణాసి కళ, సంస్కృతి, సంగీతాన్ని వర్ణించే కుడ్య చిత్రాలు ఏర్పాటు చేశారు.జపాన్ సహాయంతో ఈ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారు. అవసరమైన సమయంలో ఈ సెంటర్ చిన్న చిన్న ప్రదేశాలుగా విభజించుకొనే వెసులుబాటు కూడ ఉందని అధికారులు తెలిపారు.ఈ భవనం పర్యావరణ అనుకూలంగా నిర్మించారు. ఇక్కడ అవసరమైన భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

PREV
click me!

Recommended Stories

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Tamil Nadu Assembly
ఉచితంగా బంగారం.. సీఎం విజయ్ బర్త్ డే గిఫ్ట్ | Tamil Nadu CM Vijay Birthday Special Gold Rings Gifted