నా ఫిట్‌నెస్‌లో అమ్మ చిట్కాలు: ఫోన్ చేసినప్పుడల్లా ఇదే అడుగుతుందన్న మోడీ

Siva Kodati |  
Published : Sep 24, 2020, 03:20 PM ISTUpdated : Sep 24, 2020, 03:23 PM IST
నా ఫిట్‌నెస్‌లో అమ్మ చిట్కాలు: ఫోన్ చేసినప్పుడల్లా ఇదే అడుగుతుందన్న మోడీ

సారాంశం

ఫిట్‌నెస్‌కు ఐకాన్స్‌కు భావించే కొందరు ప్రముఖులతో ప్రధాని నరేంద్రమోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా మిలింద్ సోమన్, విరాట్ కోహ్లీతో పాటు మరికొందరితో ప్రధాని సంభాషించారు

ఫిట్‌నెస్‌కు ఐకాన్స్‌కు భావించే కొందరు ప్రముఖులతో ప్రధాని నరేంద్రమోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా మిలింద్ సోమన్, విరాట్ కోహ్లీతో పాటు మరికొందరితో ప్రధాని సంభాషించారు.

ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ పోషకాహార నిపుణురాలు రిజుటా దేవేకర్‌తో మోడీ మాట్లాడుతూ తన డైట్ రహస్యాన్ని పంచుకున్నారు.

‘వారానికి రెండు రోజులు మా అమ్మ నాకు ఫోన్ చేసి యోగ క్షేమాలు అడుగుతుందని ప్రధాని చెప్పారు. ఫోన్ చేసినప్పుడల్లా ప్రతిరోజూ పసుపు వాడుతున్నావా అని అమ్మ అడుగుతుందని ఆయన తెలిపారు. తాను కూడా పసుపు వాడకంపై సోషల్ మీడియాలో చాలా సార్లు మాట్లాడాడనని రిజుటాతో ప్రధాని అన్నారు.

ఈ ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌లో ఫిట్‌నెస్, ఆరోగ్యం గురించి మోదీ తన ఆలోచనలను పంచుకుంటూ ఇతరుల ఫిట్‌నెస్ ప్రయాణం గురించి తెలుసుకుంటారు. కొవిడ్ -19 మహమ్మారితో దేశం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఫిట్‌నెస్ వైపు ప్రజలను మరింతగా ప్రేరేపించడానికి ఈ ఫిట్ ఇండియా డైలాగ్ ఉపయుక్తంగా ఉంటుందని క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తున్నది.

ఫిట్ ఇండియా డైలాగ్ భారతదేశాన్ని ఫిట్ నేషన్ గా మార్చేందుకు ఒక ప్రణాళికను రూపొందించడానికి దేశ పౌరులను చేర్చుకునే మరో ప్రయత్నం.

ఫిట్ ఇండియా ఉద్యమం వివిధ సందర్భాల్లో క్రీడా మంత్రి కిరెన్ రిజిజు చెప్పిన ప్రాథమిక సిద్ధాంతం, పౌరులు ఖరీదైన మార్గాల్లో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడటం, ప్రవర్తనా మార్పులను తీసుకురావడం, ఫిట్‌నెస్‌ను జీవన విధానంగా మార్చడం వంటివి ఉన్నాయి.

ప్రధానితో ఈ పరస్పర చర్య దేశ పౌరులలో ఫిట్‌నెస్ పట్ల దృఢనిశ్చయాన్ని బలోపేతం చేస్తుందని క్రీడా మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu