Russia Ukraine Crisis: ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఎదుర్కొవ‌డంలో ప్ర‌ధాని మోడీ కీల‌క నిర్ణయాలు !

Published : Apr 12, 2022, 11:47 AM IST
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఎదుర్కొవ‌డంలో ప్ర‌ధాని మోడీ కీల‌క నిర్ణయాలు !

సారాంశం

 Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి నేప‌థ్యంలో భార‌త్ జాగ్ర‌త్త‌గా ముందుకు సాగుతోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. అంత‌ర్జాతీయంగా భార‌త్ ప్ర‌తిష్ఠకు భంగంక‌ల‌గ‌కుండా.. ర‌ష్యా స్నేహ సంబంధాలు కొన‌సాగిస్తూనే.. ఉక్రెయిన్ కు మాన‌వ‌తా సాయం అందించ‌డంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.   

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. అనేక దేశాలు ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించ‌డంతో పాటు భార‌త్ కూడా అదే దారిలో న‌డ‌వాల‌ని కోరుతున్నాయి. ఈ విష‌యంలో అగ్ర‌రాజ్యం అమెరికా ఇప్ప‌టికే భార‌త్‌ను హెచ్చ‌రించింది అయితే, అంత‌ర్జాతీయంగా భార‌త్ ప్ర‌తిష్ఠకు భంగంక‌ల‌గ‌కుండా.. ర‌ష్యా స్నేహ సంబంధాలు కొన‌సాగిస్తూనే.. ఉక్రెయిన్ మాన‌వ‌తా సాయం అందించ‌డంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఈ క్ర‌మంలోనే సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు.  ఇది భారతదేశం-యుఎస్ 2+2 మొదటి సంభాషణతో సమానంగా జరిగింది. అధ్యక్షుడు జో బిడెన్‌తో జరిగిన వర్చువల్ భేటీలో ఉక్రెయిన్‌లో యుద్ధంపై భారత్ త‌న‌ తటస్థ వైఖరిని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు.

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ అనుసరిస్తున్న తటస్థ వైఖరి తమకు అనుకూలం కాదని గతంలోనే వివిధ అమెరికా నేతలు స్పష్టం చేశారు. ర‌ష్యాకు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించాలని ప్రపంచ నేతలపై అమెరికా ఒత్తిడి చేసినప్పటికీ రష్యా చమురు మరియు గ్యాస్ కొనుగోలుపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మార్చిలో యునైటెడ్ స్టేట్స్, ఇండియా, ఆస్ట్రేలియా మరియు జపాన్‌ల క్వాడ్ కూటమి సమావేశంలో చివరిసారిగా ప్రసంగించినప్పుడు రష్యా దాడిని సంయుక్తంగా ఖండించడంలో PM మోడీ మరియు అధ్యక్షుడు బైడెన్ విఫలమయ్యారు. గత వారం యుద్ధ నేరాల ఆరోపణలపై రష్యాను మానవ హక్కుల మండలి నుండి సస్పెండ్ చేయడానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఓటింగ్‌కు కూడా భార‌త్ దూరంగా ఉంది. భార‌త్ శాంతి పక్షాన ఉందని, చర్చల ద్వారా సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనే స్పష్టం చేశారు. భారతదేశ అవసరాలు రష్యా మరియు ఉక్రెయిన్ రెండింటికీ అనుసంధానించబడి ఉన్నాయని కూడా ఆయన అన్నారు.

ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోడీ ఏం చెప్పారంటే.. 

1. అమెరికా-భార‌త్ రెండు దేశాలు 'ఈ రష్యా యుద్ధం అస్థిరపరిచే ప్రభావాలను ఎలా నిర్వహించాలనే దానిపై సన్నిహిత సంప్రదింపులు' కొనసాగించబోతున్నాయని ఇద్దరు నాయకులు ప్రకటించారు.

2. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు మందులు మరియు ఉపశమన సామాగ్రి విషయంలో అధ్యక్షుడు జో బిడెన్‌తో భారతదేశం చేసిన విరాళాలపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు.

3. ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో పౌరులపై రష్యా దురాక్రమణను న్యూఢిల్లీ ఖండించిన విషయాన్ని ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు బిడెన్‌కు గుర్తు చేశారు.

4. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చలు ఇరు దేశాల మధ్య శాంతికి మార్గం సుగమం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

5. ఉక్రెయిన్ మరియు రష్యా రెండు దేశాల అధినేతలు పుతిన్ మరియు జెలెన్స్కీతో తాను చాలాసార్లు మాట్లాడానని, నేరుగా మాట్లాడాల్సిందిగా వారిని కోరానని ప్రధాని మోడీ చెప్పారు.

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పూరి జగన్నాథ రథయాత్రలో అద్భుత దృశ్యాలు | Puri Jagannath Rath Yatra 2026 Lord Jagannath from Puri
వివాహేతర సంబంధం నేరం కాకపోతే.. హోటళ్లలో పోలీసుల దాడులు ఎందుకు? అసలు చట్టం ఏం చెబుతోంది?