మోదీ కి అనుకూలంగా 71శాతం ఓట్లు పడగా.. వ్యతిరేకంగా అత్యల్పంగా 21 శాతం ఓట్లు పడటం గమనార్హం.
ప్రపంచ నాయకులలో ప్రధాని మోదీ మరోసారి టాప్ గా నిలిచారు. ప్రపంచ నాయకులపై సర్వే నిర్వహించే ‘మార్నింగ్ కన్సల్ట్’ సంస్థ తన సర్వే నివేదికను తాజాగా విడుదల చేసింది. కాగా.. ఆ సర్వేలో 71 శాతం రేటింగ్తో ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారు.
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 13 మంది నాయకులపై ఈ సర్వే నిర్వహించగా... ప్రధాని నరేంద్రమోదవీ 71 శాతం ఆమోదంతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో మెక్సికోకు చెందిన ఆండ్రెస్ మాన్యుయెల్ లో పెజ్ ఒబ్రాడోర్ (66శాతం), మూడో స్థానంలో ఇటలీకి చెందిన మారియో డ్రాగి(60శాతం), ఆ తర్వాతి స్థానంలో జపాన్ కు చెందిన ఫ్యూమియో కిషిడా(48శాతం) ఉన్నారు.
Global Leader Approval: Among All Adults https://t.co/wRhUGstJrS
Modi: 71%
López Obrador: 66%
Draghi: 60%
Kishida: 48%
Scholz: 44%
Biden: 43%
Trudeau: 43%
Morrison: 41%
Sánchez: 40%
Moon: 38%
Bolsonaro: 37%
Macron: 34%
Johnson: 26%
*Updated 01/20/22 pic.twitter.com/nHaxp8Z0T5
మోదీ కి అనుకూలంగా 71శాతం ఓట్లు పడగా.. వ్యతిరేకంగా అత్యల్పంగా 21 శాతం ఓట్లు పడటం గమనార్హం.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, కెనడాకు చెందిన జస్టిన్ ట్రూడో లకు మద్దతుగా 43శాతం ఓట్లు పడ్డాయి. దీంతో.. ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. 'పార్టీగేట్' కుంభకోణంలో చిక్కుకున్న బ్రిటీష్ పీఎం బోరిస్ జాన్సన్, సర్వేలో పాల్గొన్న నాయకులలో 26 శాతం ఆమోదం రేటింగ్తో అత్యల్ప స్థానంలో నిలిచారు.
గత రెండేళ్ళలో, ప్రధాని నరేంద్ర మోదీ కి మద్దతు 84 శాతానికి చేరుకుంది.
జో బిడెన్ ఆమోదం రేటింగ్ అత్యల్ప స్థాయికి పడిపోయింది
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆమోదం రేటింగ్ 43శాతానికి పడిపోయింది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. కోవిడ్ -19 మరణాల పెరుగుదల , ఆఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ దళాలను హడావిడిగా ఉపసంహరించుకోవడం వల్ల బిడెన్ యొక్క ప్రజాదరణ గత సంవత్సరం ఆగస్టు మధ్యలో తగ్గడం ప్రారంభమైంది.
సర్వే ఎలా జరుగుతుంది?
మార్నింగ్ కన్సల్ట్ సర్వేలను నిర్వహించడానికి రాజకీయ ఎన్నికలు, ఎన్నికైన అధికారులు , ఓటింగ్ సమస్యలపై నిజ-సమయ పోలింగ్ డేటాపై ఆధారపడుతుంది. పరిశోధనా సంస్థ వయోజన జనాభాతో ప్రతిరోజూ 20,000 కంటే ఎక్కువ ప్రపంచ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది.
సర్వేలు ప్రతి దేశంలో వయస్సు, లింగం, ప్రాంతం ,కొన్ని దేశాలలో అధికారిక ప్రభుత్వ వనరుల ఆధారంగా విద్యా విచ్ఛిన్నాల ఆధారంగా లెక్కిస్తారు.