వారి పోరాట స్ఫూర్తికి వంద‌నం.. స్మృతి వన్ మెమోరియల్ ప్రారంభించిన ప్ర‌ధాని

By Rajesh KFirst Published Aug 28, 2022, 2:19 PM IST
Highlights

గుజరాత్ రాష్ట్రం కుచ్ జిల్లాలోని భుజ్‌ ప్రాంతంలో 2001లో సంభవించిన భూకంపం సమయంలో ప్రజలు చూపిన దృఢత్వాన్ని గుర్తుచేసే స్మృతి వన్ మెమోరియల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. స్మృతి వాన్ ప్రాణాలు కోల్పోయిన కచ్ ప్రజల అద్భుతమైన పోరాట స్ఫూర్తికి నివాళి అని ప్రధాని మోదీ అన్నారు. 

ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన: ప్రధాని నరేంద్ర మోదీ తన గుజరాత్ పర్యటనలో రెండో రోజు ఆదివారం కచ్ జిల్లాలోని భుజ్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ క్ర‌మంలో 2001లో సంభవించిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా ఏర్పాటు చేసిన స్మృతి వన్ మెమోరియల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ  ప్రారంభించారు. భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికి స్మృతి వాన్ నివాళులర్పిస్తున్నదని, ఈ విషాదాన్ని అధిగమించేందుకు కచ్ ప్రజల అద్భుతమైన పోరాట స్ఫూర్తికి వందనం చేస్తున్నామని మోదీ అన్నారు. అనంతరం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ కలిసి ప్రధాని నరేంద్ర మోదీ స్మృతివన్ మ్యూజియంలో ఏర్పాట్లను పరిశీలించారు.  

స్మృతి వన్ మెమోరియల్ ప్ర‌త్యేక‌లివే..
 

స్మృతి వన్ మెమోరియల్ ను దాదాపు 470 ఎకరాల విస్తీర్ణంలో  నిర్మించారు. 2001లో సంభవించిన‌ భూకంపంలో 13,000 మంది త‌మ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదంను నుండి కోలుకున్న ప్రజల పోరాట స్ఫూర్తిని నిద‌ర్శంగా స్మృతి వన్ మెమోరియల్ నిలుస్తుంది. భూకంపం కారణంగా మరణించిన వారి పేర్లను స్మారక చిహ్నంపై చెక్కారు. ఇందులో అత్యాధునిక 'మెమరీ వన్ ఎర్త్‌క్వేక్ మ్యూజియం' కూడా ఉంది.
 
ఈ మ్యూజియం 2001 భూకంపం తర్వాత గుజరాత్ రాష్ట్రాన్ని, దాని పునర్నిర్మాణ కార్యక్రమాలు,  విజయగాథలను ప్రదర్శిస్తుంది. ఇది వివిధ రకాల విపత్తుల గురించి,  భవిష్యత్తులో సంభ‌వించే విపత్తుల నుంచి ర‌క్షించుకోవ‌డానికి సంసిద్ధత గురించి సమాచారాన్ని అందిస్తుంది. మ్యూజియంలో 5డి సిమ్యులేటర్ ఉందని, దాని సహాయంతో ఈ భూకంపం సమయంలో పరిస్థితిని అనుభవించవచ్చని విడుదలలో చెప్పబడింది. దీంతో పాటు మృతులకు నివాళులర్పించేందుకు మరో బ్లాక్‌ను ఏర్పాటు చేశారు
 
ఇదిలాఉంటే.. అంతకుముందు ప్ర‌ధాని మోడీ ఉదయం భుజ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మోడీకి స్వాగతం పలికేందుకు భుజ్, పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది ప్రజలు వ‌చ్చి రహదారికి ఇరువైపులా గుమిగూడారు. హిల్ గార్డెన్ సర్కిల్ నుంచి జిల్లా పరిశ్రమల కేంద్రం వరకు మూడు కిలోమీటర్ల రోడ్ షోలో మోదీ కరచాలనం చేస్తూ ప్రజలకు అభివాదం చేశారు.

 భూకంప బాధితులకు అంకితం చేసిన స్మారక చిహ్నం, 2001 భూకంపంలో మరణించిన పిల్లలకు అంకితం చేసిన మరో స్మారక చిహ్నం,  సర్హాద్ డెయిరీలో మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్‌తో సహా అనేక ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మోదీ భుజ్‌కు వచ్చారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడిన జనాలు 'మోదీ, మోదీ' అంటూ నినాదాలు చేస్తూ త్రివర్ణ పతాకాన్ని చేతబూని ప్రధానిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మోదీ తన కారులో నిలబడి కరచాలనం చేశారు. ఆయన కూడా కారు దిగి ప్రజలకు అభివాదం చేస్తూ కొంత దూరం నడిచారు. సాంస్కృతిక, జానపద కళా ప్రదర్శనల కోసం రహదారి పొడవునా వేదికలను ఏర్పాటు చేశారు. 

 

| Smritivan earthquake memorial and museum inaugurated by PM Narendra Modi in Bhuj, Gujarat; CM Bhupendra Patel also present pic.twitter.com/v7EnnkSlam

— ANI (@ANI)
click me!