తనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడిని కలిసిన ప్రధాని మోడీ.. ఆయన పేరు తెలుసా?

Published : Jun 10, 2022, 06:10 PM IST
తనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడిని కలిసిన ప్రధాని మోడీ.. ఆయన పేరు తెలుసా?

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఒకరోజు గుజరాత్ పర్యటనలో నవసారి వెళ్లారు. అక్కడ తనకు బాల్యంలో పాఠాలు చెప్పిన గురువు జగదీశ్ నాయక్‌ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలోకి ఎక్కింది.  

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు విద్యా బోధన చేసిన స్కూల్ టీచర్‌ను కలిశారు. గుజరాత్‌లో నవసారిలోని వాడ్‌నగర్‌లో స్కూల్ టీచర్‌ను కలిశారు. ప్రధాని మోడీకి పాఠాలు చెప్పిన ఆ ఉపాధ్యాయుడి పేరు జగదీశ్ నాయక్ అని ఏబీపీ మీడియా సంస్థ ఓ కథనంలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ప్రధానమంత్రి మోడీ ఎప్పుడు గుజరాత్ పర్యటనలో ఉన్నా ఏదో ఒక కొత్త విషయాన్ని బయటకు తెచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ సారి ఆయనకు సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది. ఆ ఫొటోలో ప్రధాని మోడీ కలుసుకున్నది తనకు విద్య నేర్పిన స్కూల్ టీచర్ అని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. 

ఈ చిత్రం గుజరాత్‌లోని నవసారీలో దిగినదిగా ఏబీపీ లైవ్ సంస్థ పేర్కొంది. ఈ నవసారీలోనే ప్రధాని మోడీ తన బాల్యంలో పాఠశాల విద్యను అభ్యసించాడని వివరించింది. బయటకు వచ్చిన ఆ చిత్రంలో ప్రధాని మోడీ రెండు చేతులు జోడించి గురువుకు ప్రణామం చేస్తున్నట్టు కనిపించారు. కాగా, ఆ రిటైర్డ్(!) స్కూల్ టీచర్ జగదీశ్ నాయక్ ప్రధాని మోడీ తలపై చేయి పెడుతూ ఆయనను ఆశీర్వదిస్తున్నట్టుగా ఉన్నది.

ప్రధాని మోడీ గుజరాత్‌లో ఒక రోజు పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన నవసారి వెళ్లి తనకు బాల్యంలో చదువు చెప్పిన ఉపాధ్యాయుడిని కలుసుకున్నట్టు ఆ వార్తా సంస్థ వెల్లడించింది. మహాత్మా గాంధీ అభినులు ధరించే టోపీ, తెల్ల బట్టలతో ఆ టీచర్ జగదీశ్ నాయక్ ఉన్నట్టు తెలిసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu