
ప్రధాని నరేంద్ర మోదీ తన 72వ పుట్టినరోజు వేడుకలను (సెప్టెంబర్ 17) శనివారం జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రధాని మోదీ జన్మదినాన్ని ‘సేవా దివస్’గా జరుపుకుంటుంది. దీని కింద ప్రజాసేవకు సంబంధించిన అనేక ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సారి కూడా ప్రధాని మోడీ తన పుట్టిన రోజు నాడు చాలా బిజీబిజీగా గడుపనున్నారు.
వన్యప్రాణులు మరియు పర్యావరణం, మహిళా సాధికారత, నైపుణ్యం మరియు యువత అభివృద్ధి, తదుపరి తరం మౌలిక సదుపాయాలకు సంబంధించిన నాలుగు వేర్వేరు కార్యక్రమాలలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
ప్రధాని మోడీ తన పుట్టిన రోజు సందర్భంగా తొలుత తన తల్లి నుండి ఆశీర్వాదం తీసుకుని.. అనంతరం మధ్య ప్రదేశ్ కు చేరుకోనున్నారు. అక్కడ కునో నేషనల్ పార్క్లో నమీబియా నుండి తీసుకువచ్చిన చిరుతలను విడిచిపెడతారు. అంతరించిపోతున్న చిరుతలను పరిరక్షించుకోవడం.
అలాగే.. దేశంలోని వన్యప్రాణులకు మరింత వైవిధ్యాన్ని తీసుకురావడం ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. చిరుతలను భారత్కు తీసుకురావడానికి ఈ ఏడాది ప్రారంభంలో నమీబియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారతదేశంలో దీనిని ప్రాజెక్ట్ చిరుత అని పిలుస్తారు. చిరుతలను తరలించడానికి చేపట్టిన తొలి ఖండాంతర ప్రాజెక్ట్ ఇదే..
అనంతరం.. మధ్యాహ్నం 12 గంటలకు షియోపూర్లోని కరాహాల్లో ఏర్పాటు చేసిన ఎస్హెచ్జీ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) కింద ప్రమోట్ చేయబడిన వేలాది మంది మహిళా స్వయం సహాయక బృందం (SHG) సభ్యులు/కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు సమావేశం కానున్నారు. అలాగే..ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద గిరిజన సమూహాల (PVTG) నైపుణ్య కేంద్రాలను కూడా ప్రారంభిస్తారు.
దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ భాగంగా.. గ్రామీణ పేద కుటుంబాలను దశలవారీగా స్వయం-సహాయ సమూహాలలో చేర్చడం, వారి జీవనోపాధిని, వైవిధ్యపరచడానికి, వారి ఆదాయం, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి దీర్ఘకాలిక మద్దతును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గృహ హింస, మహిళ విద్య, ఇతర లింగ సంబంధిత ఆందోళనలు, పోషకాహారం, పారిశుద్ధ్యం, ఆరోగ్యం మరియు ప్రవర్తన మార్పు కమ్యూనికేషన్ ద్వారా మహిళా SHG సభ్యులకు సాధికారత వంటి సమస్యలపై అవగాహన కల్పించడానికి కూడా మిషన్ పని చేస్తోంది.
ఐఐటీ స్నాతకోత్సవ వేడుకల్లో
ప్రధాని మోదీ ఐఐటీ విద్యార్థుల తొలి కాన్వొకేషన్లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. అలాగే.. సాయంత్రం నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.