నేడు గుజరాత్ లో ప్ర‌ధాని రెండో రోజు ప‌ర్య‌ట‌న‌.. రూ. 9460 కోట్ల అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం..

Published : Oct 10, 2022, 10:18 AM IST
నేడు గుజరాత్ లో ప్ర‌ధాని రెండో రోజు ప‌ర్య‌ట‌న‌.. రూ. 9460 కోట్ల అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం..

సారాంశం

ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయ‌న‌ భరూచ్, జామ్‌నగర్‌ల్లో ప‌ర్య‌టించనున్నారు. ఈ క్ర‌మంలో రూ.9,460 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీ‌కారం,  ప్రారంభోత్స‌వం చేయ‌నున్నారు.   

గుజరాత్ పర్యటనలో ప్ర‌ధాని మోదీ: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు, నేడు ప్ర‌ధాని మోదీ రెండో రోజు ప‌ర్య‌ట‌న భ‌రూచ్ లో కొన‌సాగ‌నున్న‌ది. ఇక్క‌డ సూమారు రూ. 9,460 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదే సమయంలో సాయంత్రం 5 గంటలకు జామ్‌నగర్‌లో 1460 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు.

ఈరోజు ప్రధాని మోదీ ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను పరిశీలిస్తే.. ఆయన ఈరోజు  ప‌ర్య‌ట‌న ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి ఉదయం 11 గంటలకు భరూచ్‌లో రూ. 8000 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. అనంత‌రం అహ్మదాబాద్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3:15 గంటలకు అహ్మదాబాద్ లో నిరుపేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ మొదటి దశను మోడీ ప్రారంభిస్తారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి సౌకర్యాలు కల్పించడంలో ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు..

ఆ త‌రువాత‌.. సాయంత్రం జామ్‌నగర్‌లో చేరుకోనున్నారు. అక్క‌డ 5.30 గంటల స‌మ‌యంలో 1460 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభం, నూత‌న అభివృద్ది ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు.  ఈ ప్రాజెక్టులు నీటిపారుదల, విద్యుత్, నీటి సరఫరా, పట్టణ మౌలిక సదుపాయాలకు సంబంధించినవి. ఇది కాకుండా.. ప్ర‌ధాన మంత్రి సౌరాష్ట్ర అవతార్ ఇరిగేషన్ (SAUNI) స్కీమ్ లింక్ 3 యొక్క ప్యాకేజీ 5 (ఉండ్ డ్యామ్ నుండి సోన్మతి డ్యామ్ వరకు), SAUNI స్కీమ్ లింక్ 1 యొక్క ప్యాకేజీ 7 (Ud-1 డ్యామ్ నుండి SANI డ్యామ్ వరకు) మరియు హరిపర్ 40 MW సోలార్ PV ప్రాజెక్ట్  ప్రారంభించ‌నున్నారు.

నేడు ప్ర‌ధాని మోదీ కార్య‌క్ర‌మంలో కీల‌క ఘ‌ట్టాలు

కలవాడ్/జామ్‌నగర్ తాలూకాలోని మోర్బి-మాలియా-జోడియా గ్రూప్, హపా మార్కెట్ యార్డ్ రైల్వే క్రాసింగ్, లాల్‌పూర్ బైపాస్ జంక్షన్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్, మురుగునీటి సేకరణ వంటి వాటికి సంబంధించిన కలవాడ్ గ్రూప్ ఆగ్మెంటేషన్ వాటర్ సప్లై స్కీమ్‌ను నేడు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పైప్‌లైన్, మరియు పంపింగ్ స్టేషన్ పునరుద్ధరణలను ప్రారంభించనున్నారు.

PREV
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu