5జీ లింక్ ద్వారా ఢిల్లీలో కూర్చుని స్వీడన్‌లోని కారు నడిపిన ప్రధాని మోడీ.. (వీడియో)

By Mahesh KFirst Published Oct 1, 2022, 3:09 PM IST
Highlights

ప్రధాని మోడీ ఈ రోజు 5జీ సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, అదే కార్యక్రమంలో ఎరిక్సన్ స్టాల్‌లో కూర్చుని యూరప్‌లోని స్వీడన్‌లో ఉంచిన కారును నడిపారు. 5జీ టెక్నాలజీ సహాయంతో ఆయన ఇక్కడి నుంచే యూరప్‌లోని వాహనాన్ని నడిపారు. 
 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో కూర్చుని యూరప్ కంట్రీ స్వీడన్‌లోని కారును నడిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన 5జీ టెక్నాలజీ సహాయంతో ఆయన ఎరిక్సన్ స్టాల్‌లో ఈ ఫీట్ చేశారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శనివారం ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఎరిక్సన్ స్టాల్‌లో రూపుదిద్దుకున్న ఈ దృశ్యం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. స్వయంగా కేంద్ర మంత్రి పియూశ్ గోయల్ ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించిన చిత్రాలను పోస్టు చేశారు.

భారత్ ప్రపంచాన్ని నడుపుతున్నదని పేర్కొంటూ ఈ ఫొటో ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ 5జీ టెక్నాలజీ సహాయంతో ఢిల్లీ నుంచి యూరప్‌లోని కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారని వివరించారు.

India driving the world.

PM ji tests driving a car in Europe remotely from Delhi using India’s 5G technology. pic.twitter.com/5ixscozKtg

— Piyush Goyal (@PiyushGoyal)

యూరప్‌లోని స్వీడన్‌లో ఓ ఇండోర్ కోర్స్‌లో ఈ వాహనాన్ని ఉంచారు. దాన్ని నావిగేట్ చేయడనికి కంట్రోల్ సెటప్‌ను ఢిల్లీలోని ఎరిక్సన్ స్టాల్‌లో ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ ఆ సీటు పై కూర్చుని ఎదురుగా ఉన్న హ్యాండిల్‌ను, యాక్సెలేటర్, బ్రేక్‌లను యూజ్ చేస్తూ కారును డ్రైవ్ చేశారు.

WATCH | Prime Minister tries his hands on virtual wheels at the exhibition put up at Pragati Maidan before the launch of 5G services in the country. pic.twitter.com/zpbHW9OiOU

— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India)

ప్రధాని మోడీ ఈ రోజు ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ కార్యక్రమంలో 5జీ సేవలను ప్రారంభించారు. మన దేశంలో 5జీ సేవల ఎదురుచూపులు ఎట్టకేలకు ముగిశాయి. దీపావళిలోపు ఈ సేవలు యూజర్లకు అందుబాటులోకి రావొచ్చు. ఎయిర్‌టైల్, రిలయన్స్ జియో, క్వాల్కామ్ వంటి దిగ్గజ కంపెనీలు 5జీ సర్వీసులను డెమోన్‌స్ట్రేట్ చేశాయి.

click me!