భారత్-చైనా మధ్య ఉద్రిక్తత: 19న అఖిలపక్ష సమావేశానికి మోడీ పిలుపు

Published : Jun 17, 2020, 01:46 PM ISTUpdated : Jun 24, 2020, 12:09 PM IST
భారత్-చైనా మధ్య ఉద్రిక్తత: 19న అఖిలపక్ష సమావేశానికి మోడీ పిలుపు

సారాంశం

ఇండియా-చైనా సరిహద్దుల్లో నెలకొన్న సమస్యపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది భారత్. ఈ నెల 19వ తేదీన ఈ విషయమై అన్ని పార్టీలతో చర్చించనుంది ప్రభుత్వం.  

ఇండియా-చైనా సరిహద్దుల్లో నెలకొన్న సమస్యపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది భారత్. ఈ నెల 19వ తేదీన ఈ విషయమై అన్ని పార్టీలతో చర్చించనుంది ప్రభుత్వం.

చైనాకు చెందిన సుమారు 40 మంది సైనికులు మరణించినట్టుగా సమాచారం. ఈ పరిణామాలపై త్రివిధ దళాల అధికారులతో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్  సింగ్ ఈ నెల 16వ తేదీన సమావేశయ్యారు. ఈ సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి కూడ పాల్గొన్నారు.

 

సరిహద్దులో చోటు చేసుకొన్న పరిణామాలపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడే ప్రధాని మోడీకి వివరించారు.ఈ పరిణామాలపై చర్చించేందుకు గాను ఈ నెల 19వ తేదీ సాయంత్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రధాని మోడీ. కరోనా నేపథ్యంలో ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు.

also read:రేపు సూర్యాపేటలో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు

చైనా దాడిలో ఇండియాకు చెందిన సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోవడంపై  రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

ఈ ఘటనను బాధాకరమైందిగా చెప్పారు. విధి నిర్వహణలో ధైర్యం, శౌర్యాన్ని ఇండియా సైనికులు ప్రదర్శించారని ఆయన చెప్పారు.సైనికుల త్యాగాన్ని ఎవరూ కూడ మరిచిపోరన్నారు.

PREV
click me!

Recommended Stories

ఇక ప‌ని అయిపోంది అనుకున్న స‌మ‌యంలో పీకే వండ‌ర్‌.. ప్ర‌శాంత్ కిశోర్ గెలుపు అస‌లు కార‌ణ‌లేంటి?
బీహార్‍లో బీజేపీకి షాక్.. కమలం ఓడిపోవడానికి కారణమిదే | Prashant Kishor | Bihar By Election Result