ఏసీలో ఉండి దుప్పటి కప్పుకునేవారికి, కార్లలో జిమ్‌కు వెళ్లేవారికి ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..

Published : Oct 20, 2022, 04:37 PM IST
ఏసీలో ఉండి దుప్పటి కప్పుకునేవారికి, కార్లలో జిమ్‌కు వెళ్లేవారికి ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..

సారాంశం

వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడటానికి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం ఐక్యత తప్ప మరొకటి కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాతావరణ మార్పు విధాన రూపకల్పనకు మించినది అన్న ప్రధాని మోదీ.. ఎయిర్ కండీషనర్‌లను ఉపయోగించేవారికి, జిమ్‌లకు వాహనాలకు వెళ్లేవారికి సలహాలు ఇచ్చారు.

వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడటానికి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం ఐక్యత తప్ప మరొకటి కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌లోని కెవాడియాలో యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్‌తో కలిసి 'మిషన్ లైఫ్' కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రజలు తమ చుట్టూ జరుగుతున్న మార్పులను అనుభవిస్తున్నారని.. గత కొన్ని దశాబ్దాలుగా ఈ దుష్ప్రభావం వేగంగా పెరుగుతుండడాన్ని మనం చూస్తున్నామని మోదీ పేర్కొన్నారు. 

వాతావరణ మార్పు విధాన రూపకల్పనకు మించినది అన్న ప్రధాని మోదీ.. ఎయిర్ కండీషనర్‌లను ఉపయోగించేవారికి, జిమ్‌లకు వాహనాలకు వెళ్లేవారికి సలహాలు ఇచ్చారు. “మనలో కొందరు మన ఏసీలను 16 లేదా 18 డిగ్రీల వద్ద స్విచ్ ఆన్ చేసి.. ఆపై దుప్పటిని కూడా ఉపయోగించడాన్ని ఇష్టపడతారు. దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఇది పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనికి బదులు దుప్పటి లేకుండా ఆహ్లాదకరంగా అనిపించే ఉష్ణోగ్రత వద్ద ఉంచి.. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం మంచిది.

మనలో కొందరు జిమ్‌లలో వర్కవుట్ చేయడానికి ఇష్టపడతారు కానీ ఆ వ్యాయామం కోసం.. వాహనాల్లో జిమ్ సెంటర్లకు చేరుకుంటారు. కారులో జిమ్‌కి వెళ్లడం కంటే కాలినడకన వెళ్లడం మంచిది. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఇంధనం ఆదా అవుతుంది. మనం ఎందుకు నడవలేము లేదా సైకిల్‌ని ఉపయోగించలేము?’’ అని  ప్రధాని మోదీ అన్నారు.

మిషన్ లైఫ్ P3 (ప్రో ప్లానెట్ పీపుల్) భావనను బలోపేతం చేస్తుంని చెప్పారు. ‘‘నేడు మన హిమానీనదాలు కరిగిపోతున్నాయి. మన నదులు ఎండిపోతున్నాయి. వాతావరణం అనిశ్చితంగా మారుతోం. ఈ పరిణామాలు వాతావరణ మార్పులను విధాన రూపకల్పనకు మాత్రమే వదిలివేయలేమని ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. మిషన్ లైఫ్ ఈ భూమి రక్షణ కోసం ప్రజల అధికారాలను మిళితం చేస్తుంది. వాటిని మెరుగ్గా ఎలా ఉపయోగించాలో నేర్పుతుంది. 

మన ప్రభుత్వం ఎల్‌ఈడీ బల్బుల పథకాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రైవేట్ రంగం కూడా భాగస్వామ్యమైంది. 160 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను భారత ప్రజలు ఉపయోగిస్తున్నారని తెలిస్తే ఇక్కడ ఉన్న అంతర్జాతీయ నిపుణులు ఆశ్చర్యపోతారు. ఇది 100 మిలియన్ టన్నుల తక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారానికి దారితీసింది. పునరుత్పాదక శక్తిని వినియోగించుకోవడం, పర్యావరణాన్ని పరిరక్షించే మార్గంలో ఇంత త్వరగా, అద్భుతంగా అడుగుపెట్టిన దేశంలోని రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి’’ అని మోదీ చెప్పారు. ఈ మిషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ఫ్రాన్స్, అర్జెంటీనా, జార్జియా,  ఎస్టోనియాలు ప్రధానికి అభినందన సందేశాలు పంపాయి.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu