వేరే కులం అబ్బాయితో కూతురి ప్రేమ.. తల్లిదండ్రులు ఏంచేశారంటే..

By ramya neerukondaFirst Published Oct 5, 2018, 11:33 AM IST
Highlights

ఆమె కొంత కాలంగా వేరే కులానికి చెందిన అబ్బాయితో ప్రేమలో ఉంది. ఇటీవల ఆమె పుట్టిన రోజు నాడు తన లవర్ తో కలిసి  శివారు ప్రాంతాలకు వెళ్లింది. 

కూతురు వేరే కులం అబ్బాయిని ప్రేమించడం, అతనితో తిరగడం ఆమె తల్లిదండ్రులు చూసి తట్టుకోలేకపోయారు. కూతురి కన్నా పరువే ముఖ్యమని భావించారు. అంతే.. కన్న కూతురు అని కూడా చూడకుండా.. ఆమె తినే అన్నంలో నిద్రమాత్రలు కలిపి.. ఆ తర్వాత హత్య చేశారు. ఈ దారుణ సంఘటన నాసిక్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...మాలేగాం పట్టణంలోని ఇంద్రాణి కాలనీకి చెందిన నేహాచౌదరి (18) 12వతరగతి చదువుతుంది.  ఆమె కొంత కాలంగా వేరే కులానికి చెందిన అబ్బాయితో ప్రేమలో ఉంది. ఇటీవల ఆమె పుట్టిన రోజు నాడు తన లవర్ తో కలిసి  శివారు ప్రాంతాలకు వెళ్లింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి జన్మదినోత్సవం జరుపుకొని ఇంటికి వచ్చిన నేహాను ఆమె తల్లిదండ్రులు శరద్, సుమితా తన సమీప బంధువు నీలేష్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అనంతరం కుమార్తె నేహాకు నిద్రమాత్రలు కలిపిన ఆహారం పెట్టారు. ఆ భోజనం చేసి నేహా సృహ కోల్పోవడంతో ఆమెను తల్లిదండ్రులే హతమార్చారు. నేహా మృతదేహాన్ని పూడ్చేందుకు శ్మశానవాటిక వద్దకు తీసుకువెళ్లారు. పరువు కోసం జరిగిన ఈ హత్య గురించి పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తి సమాచారం అందించారు. 

అంతలో పోలీసులు హుటాహుటిన వచ్చి నేహా మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం చేయించగా హత్య అని తేలింది. ఇతర కులం యువకుడిని ప్రేమించిందని తామే నేహాను హత్య చేశామని నిందితులు సైతం అంగీకరించారు. దీంతో పోలీసులు కూతుర్ని హతమార్చిన తల్లిదండ్రులు శరద్, సుమీత, బంధువు నీలేష్ లను అరెస్టు చేశారు.

click me!