Chidambaram: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌కు స్వంత పార్టీ నుంచే నిర‌స‌న సెగ‌.. గో బ్యాక్ అంటూ నినాదాలు

Published : May 04, 2022, 11:00 PM IST
Chidambaram: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌కు స్వంత పార్టీ నుంచే నిర‌స‌న సెగ‌.. గో బ్యాక్ అంటూ నినాదాలు

సారాంశం

Protest against P Chidambaram: కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు పి.చిదంబరానికి నిరసన సెగ తగిలింది. ఓ కేసును వాదించడానికి కోల్​కతా హైకోర్టుకు వెళ్లిన ఆయ‌న‌కు సొంత పార్టీ న్యాయవాదుల నుంచే నిరసన ఎదుర్కొవల్సి వ‌చ్చింది.  ఆయ‌న‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల వస్త్రాలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ బంగాల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓటమికి కారణం చిదంబరమేనని ఆరోపించారు. టీఎంసీ పార్టీ సానుభూతిపరుడు అంటూ ఆరోప‌ణ‌లు చేశారు.   

Protest against P Chidambaram: కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి చేదు అనుభ‌వం ఎదురైంది. 
కోల్ క‌తా హైకోర్టులో నిర‌స‌న సెగ త‌గిలింది. ఆయ‌న‌కు వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన న్యాయ‌వాదులే బుధవారం నిర‌స‌న చేప‌ట్టారు. ఆందోళనకు దిగడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ లీగల్ సెల్ కార్యకర్తలు చిదంబరం కారును చుట్టుముట్టారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నల్లజెండాలు కూడా ప్రదర్శించారు.

మెట్రో డెయిరీ కేసులో చిదంబ‌రం వాద‌న
 
మెట్రో డెయిరీ వాటాల విక్రయానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నేత‌ పి చిదంబరం వాదించేందుకు 
కోల్ క‌తా హైకోర్టుకు వచ్చారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ తరపు లాయర్లు ఆయన కారును అడ్డుకున్నారు.  ఆయనను చుట్టుముట్టి.. # గో బ్యాక్ చిదంబ‌రం అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ లీగల్ సెల్‌కు చెందిన లాయర్లు కూడా పి చిదంబరానికి నల్లజెండాలు చూపించి.. నిర‌స‌నలు చేశారు. అతన్ని మమతా బెనర్జీ బ్రోకర్ అని విమ‌ర్శించారు.  

ఇలాంటి నాయకులే వల్ల‌ పార్టీ సమాధి

టీఎంసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడుతుంటే.. అదే స‌మ‌యంలో ఓ మాజీ కేంద్ర మంత్రి, పార్టీకి చెందిన నేత .. ప్ర‌తిప‌క్షంతో లాబీయింగ్ చేస్తున్నారు. అలాంటి నేతలే కాంగ్రెస్ లాంటి పార్టీలో పావులు కదుపుతున్నారని ఆరోపించారు. మీలాంటి నాయకులు కాంగ్రెస్‌ కార్యకర్తల మనోభావాలతో ఆడుకుంటున్నారని చిదంబరానికి నిరసన తెలిపిన లాయర్లు అన్నారు. మీలాంటి నాయకులు పార్టీని నాశనం చేశారు. బెంగాల్‌లో పార్టీ దురదృష్టానికి చిదంబరమే కారణమని కూడా ఆరోపించారు.
 
గో బ్యాక్ చిదంబరం

అడ్వకేట్ కౌస్తవ్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ.. చిదంబరాన్ని 'మమత బ్రోకర్' అని విమ‌ర్శించారు.  కేంద్ర మాజీ మంత్రి.. తమ పార్టీ నేతపై కేసు పెట్టడానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఈ కేసులో చాలా డబ్బు వెచ్చించారని, దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందని వారికి తెలియదా!’’ అని సుమిత్రా నియోగి అనే మహిళా న్యాయవాది ప్ర‌శ్నించారు.  
 
ఈ సమయంలో భద్రతా సిబ్బంది కాంగ్రెస్ సెల్‌కి చెందిన న్యాయవాదుల‌ను దూరంగా ఉంచారు. భద్రతా సిబ్బంది లాయర్లను పక్కకు తీసుకెళ్లడానికి పదే పదే ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో చిదంబరం మౌనం వహించారు. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒకటి రెండు సార్లు మాత్రమే వేలితో చూపారు.
 
వాస్తవానికి.. మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (TMC)పై దాఖలైన అవినీతి కేసును వాదించేందుకు పి చిదంబరం కలకత్తా హైకోర్టుకు చేరుకున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే..  కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి. క్వెంటర్ ఆగ్రోతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం మెట్రో డెయిరీ షేర్లను అతి తక్కువ ధరకు మమతా బెనర్జీ విక్రయించిందని చౌదరి ఆరోపించారు. 

ఆ త‌రువాత రాష్ట్ర ప్రభుత్వం మెట్రో డెయిరీ వాటాలను సింగపూర్ కంపెనీ కావెంటర్స్‌కు అనైతికంగా విక్రయిస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కావెంటర్ల పక్షం వాదనలు వినిపించేందుకు పి చిదంబరం కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. పి చిదంబరాన్ని ప్రతిపక్ష లాయర్‌గా చూసి కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం చెందారు మరియు పార్టీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu