ప్రజల దృష్టి మళ్లించడానికే .. : మొఘల్‌ గార్డెన్‌ పేరు మార్పుపై ప్రతిపక్షాల ఫైర్.. 

Published : Jan 30, 2023, 04:57 AM IST
ప్రజల దృష్టి మళ్లించడానికే .. : మొఘల్‌ గార్డెన్‌ పేరు మార్పుపై ప్రతిపక్షాల ఫైర్.. 

సారాంశం

రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్స్‌ పేరును కేంద్రం అమృత్‌ ఉద్యాన్‌ గా మార్చడంపై ప్రతిపక్షలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశంలో చాలామంది ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దేశంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కేంద్రం చారిత్రక ప్రాంతాల పేర్ల మార్పు ఎత్తుగడను ఎంచుకున్నదని విమర్శించాయి. 

రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్ పేరు అమృత్ మహోత్సవ్ పేరుతో పేరు మార్చారు. దీంతో రాజకీయ వేడెక్కింది. పేరు మార్చడంపై ప్రతిపక్షలు విమర్శలు గుప్పిస్తున్నాయి . ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం కన్నౌజ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మా పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉందని అన్నారు. బీజేపీని ప్రజలు ఎవరినీ అంగీకరించరని అన్నారు. ఎవరు ఏం చేయాలో అనేది బీజేపీ నేతలే నిర్ణయిస్తారని, మొఘల్ గార్డెన్ పేరును బీజేపీ నిర్ణయిస్తుందా? తన పని తాను చేసుకోలేని బీజేపీ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు.
 

మరోవైపు.. రాష్ట్రపతి భవన్‌లోని ప్రసిద్ధ మొఘల్ గార్డెన్స్ పేరు మార్చడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా బీజేపీని టార్గెట్ చేసింది. దేశంలో నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, మతమార్పిడి,  మరియు ద్వేషపూరిత ప్రసంగాలు వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కేంద్రం చారిత్రక ప్రాంతాల పేర్ల మార్పు ఎత్తుగడను ఎంచుకున్నదని  విమర్శించారు.

రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్ పేరు మార్చడం వల్ల దేశంలోని కోట్లాది మంది ప్రజల సమస్యలు తీరతాయా అని మాయావతి సోమవారం మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లేకుంటే ప్రభుత్వం తన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా సామాన్య ప్రజానీకం దీన్ని పరిగణిస్తుందని విమర్శించారు. దేశంలో ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారని అన్నారు. వాటిని పట్టించుకోకుండా మతమార్పిడులు, పేరుమార్పులు, బహిష్కరణ, విద్వేషపూరిత ప్రసంగాల ద్వారా ప్రజల దృష్టి మరల్చడం చాలా బాధాకరమని అన్నారు. 


మొఘల్ గార్డెన్ .. అమృత్ ఉద్యాన్ గా మార్పు

జనవరి 28న రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్ పేరు మార్చబడింది. ఇప్పుడు అది 'అమృత్ ఉద్యాన్'గా పిలవబడుతుంది. మొఘల్ గార్డెన్ అందానికి ప్రసిద్ధి. దీన్ని చూసేందుకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. 138 రకాల గులాబీలు, 10,000 కంటే ఎక్కువ తులిప్, 70 రకాల జాతులకు చెందిన 5,000 కాలానుగుణ పుష్ప జాతులు ఉన్నాయి. ఈ ఉద్యానవనాన్ని దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సామాన్య ప్రజల కోసం తెరిచారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వసంత రుతువులో ప్రజల కోసం తెరవబడుతుంది. 

జనవరి 31 నుంచి అందుబాటులోకి 

జనవరి 31 నుంచి రాష్ట్రపతి భవన్‌లోని అమృత్‌ ఉద్యానవనం సామాన్యుల కోసం తెరవబడుతుంది. ఉద్యాన్ ఉత్సవ్ 2023 .. మార్చి 26,  2023 వరకు సాగుతుంది. ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు చేరుకుంటారు.  మొఘల్ గార్డెన్ అనేక భాగాలుగా విభజించబడింది. ఇందులో రోజ్ గార్డెన్‌తో పాటు బయో డైవర్సిటీ పార్క్, హెర్బల్ గార్డెన్, సీతాకోకచిలుక, మ్యూజికల్ ఫౌంటెన్, సన్‌కెన్ గార్డెన్, కాక్టస్ గార్డెన్, న్యూట్రిషనల్ గార్డెన్ , బయో ఫ్యూయల్ పార్క్ ఉన్నాయి. ఇక్కడ తులిప్, మోగ్రా-మోటియా, రజనిగంధ, బేలా, రాత్ కీ రాణి, జుహీ, చంపా-చమేలీ వంటి అనేక రకాల పూల మొక్కలను చూడవచ్చు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !