సెల్‌ఫోన్ కంపెనీలో ఆరుగురికి కరోనా: ఫ్యాక్టరీ మూసివేత

Published : May 18, 2020, 06:32 PM ISTUpdated : May 18, 2020, 06:43 PM IST
సెల్‌ఫోన్ కంపెనీలో ఆరుగురికి కరోనా: ఫ్యాక్టరీ మూసివేత

సారాంశం

న్యూఢిల్లీలోని నోయిడాలోని ఓ సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో ఈ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా కంపెనీ  ప్రకటించింది.


న్యూఢిల్లీ:న్యూఢిల్లీలోని నోయిడాలోని ఓ సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో ఈ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా కంపెనీ  ప్రకటించింది.

ఈ కంపెనీలో సుమారు 3 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఫ్యాక్టరీకి ఎవరూ కూడ రావొద్దని కంపెనీ తన ఉద్యోగులను ఆదేశించింది. ఈ కంపెనీలో పనిచేసే ఆరుగురికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా కంపెనీని మూసివేసినట్టుగా కంపెనీ తెలిపింది.

also read:రాష్ట్రపతి భవన్ లో పోలీస్ అధికారికి కరోనా: పలువురు క్వారంటైన్ కు

కరోనా సోకిన ఆరుగురు ఉద్యోగులతో సన్నిహితంగా ఉన్న వారెవరనే విషయమై కూడ అధికారులు ఆరా తీస్తున్నారు. మరో వైపు కంపెనీలోని మిగిలిన ఉద్యోగులకు కూడ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీలోని ఇతర ఉద్యోగులకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. 

కేంద్ర ప్రభుత్వం మే 2వ తేదీన ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో ఈ  ఫ్యాక్టరీని ఈ నెలలో తెరిచారు. 30 శాతం ఉద్యోగులతో కంపెనీ తిరిగి కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా సోకిన విషయం పరీక్షల్లో తేలింది. దీంతో ఫ్యాక్టరీని ముందు జాగ్రత్తగా మూసివేశారు.

ఈ కంపెనీలో మొత్తం 10వేల మంది ఉద్యోగులు ఉన్నారు.  లాక్ డౌన్ నేపథ్యంలో 30 శాతం ఉద్యోగులతో ఫ్యాక్టరీని ప్రారంభించాలని అనుమతి ఇచ్చింది.ఈ అనుమతి మేరకు ఫ్యాక్టరీ తిరిగి ఓపెన్ చేశారు.

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu