అరుదైన పాము.. విలువ రూ.9కోట్లు

Published : Nov 24, 2018, 04:52 PM IST
అరుదైన పాము.. విలువ రూ.9కోట్లు

సారాంశం

మల్దా జిల్లా పరిసర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఆ పాము తక్షక్ జాతికి చెందినదని.. దాని విలువ దాదాపు రూ.9కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. 

అరుదైన రకానికి చెందిన ఓ పామును స్మగ్లింగ్ చేస్తూ.. ఓ వ్యక్తి కోల్ కతా పోలీసులకు చిక్కాడు. మల్దా జిల్లా పరిసర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఆ పాము తక్షక్ జాతికి చెందినదని.. దాని విలువ దాదాపు రూ.9కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... కోల్‌కతాకు చెందిన ఇషా షేక్‌ అనే వ్యక్తికి అరుదైన జంతుజాలాల స్మగ్లింగ్‌ ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో తక్షక్‌ పామును వారికి అమ్మేందుకు 9 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డీల్‌ ప్రకారం జార్ఖండ్‌కు పామును తరలించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు బ్యాగును పరిశీలించిగా పాము కనిపించడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

కాగా పశ్చిమ బెంగాల్‌లోని కలియాచాక్‌ అడవుల్లో కనిపించే ఈ పాములు అత్యంత విషపూరితమైనవి. చూడటానికి బల్లిలా ఉండే తక్షక్‌ పాముల నుంచి సేకరించిన విషాన్ని పలు రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్‌లో ఇవి భారీ ధర పలుకుతాయి.

PREV
click me!

Recommended Stories

ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu
Indian Army : సైన్యం కోసం ఇండియా ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?