త‌ప్పుడు కేసులు.. పోలీసు స్టేష‌న్ పై ప్ర‌జాగ్ర‌హం.. 8 మంది పోలీసుల‌కు గాయాలు

Published : Sep 13, 2022, 05:45 PM IST
త‌ప్పుడు కేసులు.. పోలీసు స్టేష‌న్ పై  ప్ర‌జాగ్ర‌హం.. 8 మంది పోలీసుల‌కు గాయాలు

సారాంశం

Odisha: త‌ప్పుడు కేసులు పెట్టార‌ని ఆరోపిస్తూ దాదాపు 200 మందికి పైగా ప్ర‌జ‌లు పోలీసు స్టేష‌న్ పై దాడి చేశారు. ఈ ఘ‌ట‌నలో ఎనిమిది మంది పోలీసులు గాయ‌ప‌డ్డారు. వారిలో ఇద్దరు ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.   

Police station:  ప్ర‌జాగ్ర‌హం పెల్లుబికింది. త‌ప్పుడు కేసులు పెట్టిన పోలీసు స్టేష‌న్ పై రెచ్చిపోయారు. అక్క‌డ విధ్వంసం సృష్టించారు. అడ్డువ‌చ్చిన అధికారుల‌పై దాడి చేశారు. త‌ప్పుడు కేసులు పెట్టార‌ని ఆరోపిస్తూ దాదాపు 200 మందికి పైగా ప్ర‌జ‌లు పోలీసు స్టేష‌న్ పై దాడి చేశారు. ఈ ఘ‌ట‌నలో ఎనిమిది మంది పోలీసులు గాయ‌ప‌డ్డారు. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే..  ఒడిశాలోని గజపతి జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌పై మంగళవారం సుమారు 200 మందితో కూడిన‌ గుంపు దాడి చేసింది. ఈ ఘ‌ట‌న‌లో పలువురు అధికారులు గాయపడ్డారు. గంజాయి స్మగ్లింగ్ ఆరోపణలపై స్థానిక యువకుడిని అరెస్టు చేసిన గంటల తర్వాత, ఒడిశాలోని గజపతి జిల్లాలో మంగళవారం సుమారు 200 మంది గుంపు పోలీసు స్టేషన్‌లోకి చొరబడి అక్కడి అధికారులపై దాడి చేసిందని ఇండియా టూడే నివేదించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు గాయపడ్డారని, వీరిలో ఇద్దరిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అధికారి ఒకరు తెలిపారు.

"ఆందోళనకారులు పోలీసు స్టేషన్ గేటు తెరిచారు. లోప‌లికివ‌చ్చి సిబ్బందిని చితకబాదారు. ఆస్తులను దోచుకున్నారు. అక్క‌డి వ‌స్తువుల‌ను ధ్వంసం చేశారు. వారందరూ ఆయుధాలు కలిగి ఉన్నారు. కొట్లాటలో కనీసం ఏడు నుండి ఎనిమిది మంది సిబ్బంది గాయపడ్డారు" అని సంఘటన స్థలంలో ఉన్న ఒక‌ అధికారి తెలిపారు. సీనియర్ పోలీసు అధికారులు ప్రస్తుతం ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. అయితే, స‌ద‌రు పోలీసు స్టేష‌న్ పై ప్ర‌జాగ్ర‌హం ఈ స్థాయికి చేరుకోవ‌డానికి త‌ప్పుడు కేసుల‌ని స‌మాచారం. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. సోమవారం రాత్రి ఝరానాపూర్‌కు చెందిన యువకుడిపై తప్పుడు కేసులు పెట్టి పోలీసులు పట్టుకున్నారని, వెంటనే విడుదల చేయాలని మహిళలతో సహా ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
 

 

 

PREV
click me!

Recommended Stories

Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan
Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?