North East Express: ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్.. 

Published : Oct 11, 2023, 11:13 PM ISTUpdated : Oct 12, 2023, 12:23 AM IST
North East Express: ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్.. 

సారాంశం

North East Express: బీహార్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ నుంచి కామాఖ్య వెళ్తున్న నార్త్ ఎక్స్‌ప్రెస్ బుధవారం రాత్రి ప్రమాదానికి గురైంది. బీహార్ లోని బక్సర్ జంక్షన్ నుంచి రైలు బయల్దేరిన కొద్దిసేపటికే రఘునాథ్‌పూర్ స్టేషన్‌లో సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 

North East Express:  బీహార్‌లోని బక్సర్ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి కామాఖ్య వెళ్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. అందుతున్న సమాచారం ప్రకారం.. రైలులోని మూడు బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటన డీడీయూ పాట్నా రైల్వే సెక్షన్‌లోని రఘునాథ్‌పూర్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. జిల్లా యంత్రాంగం, పోలీసు బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

ఈ రైలు ఢిల్లీ నుంచి పాట్నా వైపు వెళ్తున్నట్లు సమాచారం. ఈ రైలు బక్సర్ జంక్షన్ నుండి పాట్నాకు బయలుదేరింది. ఈ రైలు రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంతో ఇతర రైళ్లను నిలిపివేశారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి బయలుదేరారు. క్షతగాత్రులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని తూర్పు మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?