Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో ప్రవేశించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అయోధ్యలోని రామజన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, కోశాధికారి చంపత్ రాయ్ తమ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు.
Bharat Jodo Yatra: విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గుండా వెళుతున్న కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను చేపట్టినందుకు రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. ఈ వాతావరణంలో ఒక యువకుడు కాలినడకన దేశవ్యాప్తంగా నడుచుకుంటూ, దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అభినందనీయమని రాయ్ విలేకరులతో అన్నారు. అయోధ్యలోని రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ నుండి ఆశీర్వాదం పొందిన తరువాత గాంధీ ప్రచారానికి ఇది అదనపు ప్రోత్సాహం. భారత్ జోడో యాత్ర మంగళవారం ఘజియాబాద్ లోని లోని సరిహద్దు గుండా న్యూఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించింది.
వివరాల్లోకెళ్తే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్రకు అయోధ్యలోని రామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, కోశాధికారి శుభాకాంక్షలు తెలిపారు. 'భారత్ జోడో యాత్రకు ఎవరూ వ్యతిరేకం కాదు. యాత్రలో ఎలాంటి తప్పు లేదని, నేను అభినందిస్తున్నాను అని శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అయోధ్యలో విలేకరులతో అన్నారు. తాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తననీ, భారత్ జోడో యాత్రను ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ ఖండించలేదని ఆయన అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి కూడా మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడి పాదయాత్రను స్వాగతించారు. రాహుల్ గాంధీని ఆశీర్వదించాలని నేను శ్రీరాముడిని ప్రార్థిస్తున్నాను' అని గిరి అన్నారు. అయోధ్యలోని రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ కూడా సోమవారం వయనాడ్ ఎంపీకి తన ఆశీర్వాదాలను తెలియజేశారు.
'దేశం కోసం మీరు చేసే ఏ పని అయినా అందరికీ మేలు చేసేదే. నా ఆశీస్సులు మీతోనే ఉన్నాయి' అని దాస్ (82) యూత్ కాంగ్రెస్ నేత గౌరవ్ తివారీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. రాముడి ఆశీస్సులు మీతో (రాహుల్ గాంధీ) ఉండాలి' అని ట్వీట్ చేశారు. చంపత్ రాయ్ మరింతగా మాట్లాడుతూ.. “ఒక యువకుడు కాలినడకన నడుస్తున్నాడు, అది ప్రశంసించదగినది, ఎవరు విమర్శించారు? నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, సంఘ్ ఎవరైనా విమర్శించారా? ప్రధాని విమర్శించారా? ఒక యువకుడు దేశంలో పర్యటించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దేశం...ఈ వాతావరణంలో అతను 3,000 కిలో మీటర్లు కాలినడకన నడిచాడు. ఈ చర్యను మేము అభినందిస్తున్నాము. ప్రతి ఒక్కరూ భారతదేశ పాదయాత్ర చేయాలి.. దేశంపై పరిశోధనలు చేయాలి" అని రాయ్ అన్నారు.
దాస్ భారత్ జోడో యాత్రను " సర్వజన్ హితయ , సర్వజన్ సుఖాయ" (అందరి సంక్షేమం- సంతోషం) అనే నినాదంతో పోల్చారు. అన్ని వర్గాల కోసం పని చేయాలనే వారి సిద్ధాంతాలను హైలైట్ చేయడానికి బీజేపీ, బీఎస్పీ రెండూ ఉపయోగించే నినాదం . కాంగ్రెస్ సీనియర్ ఎంపీ జైరాం రమేష్ ట్విట్టర్ పోస్ట్లో ఇద్దరు వ్యక్తులు చేసిన ప్రస్తావనలను ప్రస్తావించారు.