పెళ్లి చేసుకున్న మొదటి రాత్రే నవ దంపతులు మృతి.. పోస్టుమార్టంలో తేలిన విషయమిదే!

By Mahesh KFirst Published Jun 4, 2023, 4:15 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బహ్రెచ్ జిల్లాలో మే 30వ తేదీన పెళ్లి చేసుకున్న ప్రతాప్ యాదవ్, పుష్పలు అదే రోజు రాత్రి మరణించారు. పెళ్లి చేసుకున్న మరుసటి రోజే వారిద్దరూ విగత జీవులై కనిపించారు.
 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నవ దంపతుల జీవితం మొదలైన రోజే ముగిసింది. పెళ్లి చేసుకున్న మొదటి రోజు రాత్రే నవ దంపతులు మరణించారు. ఉదయం వారిద్దరూ విగతజీవులుగా మారారు. ఈ విషాద ఘటన బహ్రేచ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోస్టుమార్టం నివేదికలో వారిద్దరూ హార్ట్ ఎటాక్‌తో మరణించారని తేలింది.

20 ఏళ్ల ప్రతాప్ యాదవ్, 20 ఏళ్ల పుష్ప మే 30వ తేదీన పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్య భర్తలు ఇద్దరూ గదిలోకి వెళ్లారు. కానీ, ఉదయం వారిద్దరూ విగత జీవులై కనిపించారు.

పోలీసులకు విషయం తెలియగానే స్పాట్‌కు చేరుకున్నారు. ఈ రెండు డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ తరలించారు.

Also Read: పేరు మార్చుకుని మహిళను నమ్మించి మోసం చేశాడు.. తండ్రితోనూ అక్రమ సంబంధానికి బలవంతం

ఈ పోస్టుమార్టం నివేదికలో భార్య, భర్త ఇద్దరూ హార్ట్ ఎటాక్‌తో మరణించినట్టు ఎస్పీ ప్రశాంత్ వర్మ తెలిపారు.

భార్య భర్తలు ప్రతాప్, పుష్ప ఇద్దరినీ గ్రామ ప్రజలు ఒకే చితిపై దహనం చేశారు.

 

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు తన పేరును మార్చుకుని మహిళతో పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా ఆమెతో కలిశాడు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆ వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. అనంతరం, తన తండ్రితోనూ అక్రమ సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. తన గుర్తింపును దాచినందుకు ఈ వ్యక్తి పై కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు కూడా చేశారు.

click me!