ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాలను పనిచేయనివ్వండి: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

Published : Jan 13, 2023, 02:26 PM IST
ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాలను పనిచేయనివ్వండి: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

సారాంశం

New Delhi: చిన్న పక్షపాత ప్రయోజనాల కోసం ఎన్నికైన ప్రభుత్వాలు తమ పనిని చేయకుండా అడ్డుకోవడం ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి మంచిది కాద‌ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో అధికార నియంత్రణపై ఇరువురి మధ్య వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో, కేజ్రీవాల్ శుక్రవారం లెఫ్టినెంట్-గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాతో సమావేశం కానుండ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.   

Delhi chief minister Arvind Kejriwal: చిన్న పక్షపాత ప్రయోజనాల కోసం ఎన్నికైన ప్రభుత్వాలను అడ్డుకోవడం ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి మంచిదికాద‌ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అన్నారు. ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవపై ది హిందూస్తాన్ టైమ్స్ ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన కాలమ్ ను  ఉటంకిస్తూ కేజ్రీవాల్  ట్విట్ట‌ర్ లో ఇలా రాసుకొచ్చారు. "చిన్న పక్షపాత ప్రయోజనాల కోసం ఎన్నికైన ప్రభుత్వాలు తమ పనిని చేయకుండా అడ్డుకోవడం ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి చెడ్డ‌ది" అని ఆయన అన్నారు. "ఎన్నికైన ప్రభుత్వాలు పనిచేయనివ్వండి. చిన్న పక్షపాత ప్రయోజనాల కోసం ఎన్నికైన ప్రభుత్వాలు తమ పనిని చేయకుండా అడ్డుకోవడం ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి చెడ్డది" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

 

లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ప్రభుత్వం మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. 2022లో పదవీ బాధ్యతలు చేపట్టిన ఎల్జీ వీకే సక్సేనా పదవీకాలం ప్రారంభం నుంచి ఇరు వ‌ర్గాల మ‌ధ్య‌ ఇప్పటికీ విభేధాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని పాఠశాల ఉపాధ్యాయుల విదేశీ శిక్షణపై ప్రభుత్వం-ఎల్‌జీ మధ్య తాజా వివాదం గురించి ప్ర‌స్తావించిన కేజ్రీవాల్.. శిక్షణ కోసం ఉపాధ్యాయులను ఫిన్‌లాండ్‌కు పంపే ప్రతిపాదనను ఎల్‌జీ తిరస్కరించార‌ని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ గురువారం ఆప్ కు రికవరీ నోటీసు పంపింది. 10 రోజుల్లో ₹164 కోట్లు డిపాజిట్ చేయాలని కోరింది. సుప్రీంకోర్టు జారీ చేసిన రాజకీయ ప్రకటనల్లోని మార్గదర్శకాలను పార్టీ ఉల్లంఘించిందని నోటీసులో పేర్కొన్నారు. ఈ అంశం ఇప్పుడు ఢిల్లీలో ప్ర‌భుత్వానికి, ఎల్జీకి మ‌ధ్య విభేధాల‌ను మ‌రింత‌గా పెంచింది.

అయితే, ఢిల్లీలోని ఎల్‌జీ అధికారులకు సంబంధించి సుప్రీంకోర్టు పరిశీలన వేరే కేసుపై ఉంది. "కేంద్రం కోరిన విధంగా పరిపాలనా కార్యక్రమాలు నిర్వహించాలంటే ఢిల్లీలో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి" అని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ విచారణ సందర్భంగా అన్నారు. కేంద్రం ద్వారా ఢిల్లీ ప్రభుత్వ అధికారులపై బీజేపీ రాజ్యాంగ విరుద్ధమైన నియంత్రణను కలిగి ఉందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు తన పార్టీ నుంచి రూ. 163.61 కోట్ల రికవరీ కోసం డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ (డిఐపి) నోటీసు పంపడాన్ని కూడా ఆయన రాజ్యాంగ విరుద్ధమైన నియంత్రణగా పేర్కొన్నారు. నోటీసు ప్రకారం 2016-17లో ఆప్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలకు సంబంధించి రూ.163.61 కోట్లు రికవరీ చేస్తామని సిసోడియా తెలిపారు.

ఈ వారం ప్రారంభంలో, ఎల్‌జీ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. సంఘర్షణ రహిత పాలన కోసం క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని కోరారు. తమిళనాడులో కూడా డీఎంకే ప్రభుత్వం-గవర్నర్ ఆర్‌ఎన్ రవి మధ్య వాగ్వాదం జరుగుతోంది, ఈ విషయం ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చేరుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో, గవర్నర్ తన సంప్రదాయ ప్రసంగంలో ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలను మినహాయించారు. నగరంలో అధికార నియంత్రణపై ఇరువురి మధ్య వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా, అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ఎల్‌జీ సెక్రటేరియట్‌లో ఈ సమావేశం జరగనుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu