కాంగ్రెస్ పార్టీ సంకల్ప సత్యాగ్రాహ దీక్షలో జగదీష్ టైట్లర్ పాల్గొనడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుండి అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సంకల్ప సత్యాగ్రహ దీక్షను నిర్వహిస్తుంది. ఈ దీక్షలో జగదీష్ టైట్లర్ పాల్గొనడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ]
Congress & Gandhi family is not only OBC virodhi but Sikh virodhi too
Jagdish Tytler , blamed for 1984 genocide, at Satyagraha ! This is a duragraha not Satyagraha against courts, OBC samaj & Sikhs
Congress hates OBCs & Sikhs too
Jagdish TYTLER has been time and again given… pic.twitter.com/2V822GzfFZ
The Irony!
Congress is doing 'Sankalp Satyagrah' at Rajghat today.
First person to arrive at Satyagrah is 1984 Riots accused Jagdish Tytler. pic.twitter.com/LP8RiLbOj8
కాంగ్రెస్ పార్టీ ఇవాళ న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న సంకల్ప సత్యాగ్రాహ దీక్షలో పాల్గొనేందుకు జగదీష్ టైట్లర్ దీక్షా శిబిరానికి ముందుగా చేరుకున్నారు. కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలో గాంధీజీ మాదిరిగా జగదీష్ టైట్లర్ కూర్చున్నాడని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. గాంధీజీ ఫోటో, టైటర్లను ఫోటోను పక్క పక్కన పెట్టి అంకుర్ సింగ్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఓబీసీ, సిక్కు విరోధి కూడా అని నెటిజన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సత్యాగ్రహం ఓబీసీలు, సిక్కులకు వ్యతిరేకంగా సాగిస్తున్న దుదాగ్రహంగా నెటిజన్ పేర్కొన్నారు. జగదీష్ టైట్లర్ కు కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రముఖ స్థానం ఇస్తుందని ఆ నెటిజన్ విమర్శలు గుప్పించారు.