NEET UG 2022: షెడ్యూల్ ప్రకారమే నీట్ ఎగ్జామ్.. వాయిదా వేయాలనే పిటిషన్లను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

Published : Jul 14, 2022, 04:53 PM IST
NEET UG 2022: షెడ్యూల్ ప్రకారమే నీట్ ఎగ్జామ్.. వాయిదా వేయాలనే పిటిషన్లను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

సారాంశం

గ్రాడ్యుయేట్ లెవల్ మెడికల్ అడ్మిషన్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2022 ) ఈ నెల 17న నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలని దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.

గ్రాడ్యుయేట్ లెవల్ మెడికల్ అడ్మిషన్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2022 ) ఈ నెల 17న నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలని కొందరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షను నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత షెడ్యూల్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. అయితే నీట్ పరీక్షను వాయిదా వేయాలని చేసిన అభ్యర్థను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఇది చాలా ఆలస్యమైందని, పిటిషన్ తప్పుగా ఉందని కోర్టు పేర్కొంది. అయితే పిటిషనర్లు విద్యార్థులు కాబట్టి ఖర్చులు వసూలు చేయబోమని కోర్టు కూడా చెప్పింది.

‘‘పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఆర్డర్ ఇవ్వడానికి నేను చాలా మొగ్గు చూపుతున్నాను. అయితే వీళ్లు విద్యార్థులు కాబట్టి మేము వెళ్లడం లేదు. అలాంటి పిటిషన్లు దాఖలు చేస్తే.. కోర్టు ఖర్చులు విధించకుండా సిగ్గుపడదు’’ అని జస్టిస్ నరులా పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని కోర్టు పేర్కొంది. చివరి నిమిషంలో పరీక్షను వాయిదా వేయమని 15 మంది విద్యార్థులు ఎలా అడుగుతారని కూడా కోర్టు ప్రశ్నించింది.

ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా.. పరీక్షను వాయిదా వేయబోమని NTA తన స్టాండ్‌ను కొనసాగించింది. గత రెండేళ్లుగా అకాడమిక్ క్యాలెండర్‌కు అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. పరీక్షను వాయిదా వేయవద్దని NTA తరఫు న్యాయవాది కోర్టును కోరారు. నీట్ పరీక్షకు నమోదు చేసుకున్న విద్యార్థుల్లో 90 శాతం మంది తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నారని NTA న్యాయవాది కోర్టుకు తెలిపారు. సాధ్యమయ్యే అన్ని ఏర్పాట్లు చేస్తామని, అవసరమైన మద్దతు కోసం ఏజెన్సీ ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాసిందని కూడా కోర్టుకు తెలియజేశారు.

ఇక, పరీక్ష వాయిదా వేయాలనే పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో.. నీట్ యూజీ 2022 పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జూన్ 17న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను ఇప్పటికే అధికారిక వెబ్‌సైటల్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. 


 

PREV
click me!

Recommended Stories

African Queen Ant Smuggling: చీమల స్మగ్లింగ్ వీటితో కోట్లు సంపాదన | Asianet News Telugu
CBSE కొత్త రూల్.. పిల్లలపై భారం తప్పదా? 3 భాషలు చదవాల్సిందేనా? | Asianet News Telugu