ఆ నిర్ణయం పట్ల ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. ఇలా జరుగుతుందని ముందే ఊహించా..

Published : Oct 09, 2022, 05:02 PM IST
ఆ నిర్ణయం పట్ల ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. ఇలా జరుగుతుందని ముందే ఊహించా..

సారాంశం

శివ‌సేన పార్టీ పేరు, గుర్తు విష‌యంలో భార‌త ఎన్నిక సంఘం(ఈసీ) తీసుకున్న‌ నిర్ణ‌యంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఆ నిర్ణయం పట్ల తాను ఏమాత్రం ఆశ్చర్యపోలేదనీ.  ఇలా జరుగుతుందని మొద‌ట‌గానే  ఊహించానని అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందని నిర్ధారించడానికి త‌న‌ దగ్గర ఎటువంటి రుజువు లేక‌పోయినా.. శివ‌సేన‌ను అంతం చేయాల‌ని భావిస్తున్నార‌ని ఎన్సీపీ చీఫ్ అన్నారు.   

శివసేనకు భార‌త ఎన్నిక సంఘం(ఈసీ) ఊహించ‌ని షాకిచ్చింది. పార్టీ గుర్తు విషయంలో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్‌ ఠాక్రే, సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని వర్గాలకు శివసేన పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును వాడుకోకుండా స్తంభింపజేసింది. ఈ క్ర‌మంలో రెండు వర్గాలు వారిని సోమవారం వరకు మూడు పేర్లు, గుర్తులను సూచించాలని ఎన్నిక‌ల ఆదేశించింది. ఆ వాటి నుంచే పార్టీ పేరు, చిహ్నాన్ని ఎంపిక చేసి.. ఇరు వర్గాలకు కేటాయించనుంది. 

ఈ ప‌రిణామంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఈ నిర్ణయం పట్ల 
తానేమీ ఆశ్చర్యపోలేదనీ, ఇలాంటిదేదో జరుగుతుందని మొద‌టగానే ఊహించానని అన్నారు. కావాలనే ఇలా చేస్తున్నారని చెప్పడానికి  త‌న దగ్గర ఆధారాలు లేకపోయినా.. అలా జరుగుతుందని అనుకున్నానని అన్నారు. ఈరోజుల్లో ఎవరు నిర్ణయం తీసుకుంటారో తెలియదనీ, అయితే ఇది శివసేనను అంతం చేయదని  కొన్ని శ‌క్తులు భావిస్తున్నాయ‌ని చెప్ప‌గ‌ల‌ననీ అన్నారు. పార్టీలోని యువత బలంతో మరింత దూకుడుతో, శక్తితో తిరిగి వస్తుందని శరద్ పవార్ చెప్పారు. 
 
ఇక శ‌ర‌ద్ పవార్ మాట్లాడుతూ.. పార్టీ ఎంత బలంగా ఉన్నా.. అదే పార్టీ గుర్తుతో ఎన్నికలకు వెళ్లగలదని  ఊహించలేమని అన్నారు. కాబట్టి ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధంగా ఉండాలని,  కొత్త పార్టీ గుర్తుతో ఎన్నికలను ఎదుర్కోవడం తప్ప శివసేనకు మరో మార్గం లేదనీ. తాను కూడా ఎద్దుల జత,  దూడ, రాట్నం, పంజా, ఆ తర్వాత గడియారం లాంటి ఎన్నో ఎన్నికల గుర్తులతో ఎన్నికల్లో పోరాడానని చెప్పారు.
 
ఎన్నికల సంఘం నిర్ణయంతో శివసేన ఆగదనీ, ఎవరికి మద్దతివ్వాలనేది ప్రజలే నిర్ణయిస్తారని శ‌ర‌ద్ ప‌వ‌ర్ అన్నారు. ఏ ఎన్నికల గుర్తుపై పోటీ చేస్తారనేది నిజంగా పట్టింపు లేదని ఎన్‌సిపి చీఫ్ అన్నారు. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం శివసేనను అంతం చేయదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నిజానికి.. పార్టీలోని యువత వెన్నుపోటుతో మరింత దూకుడుతో.. ఉత్సాహంతో తిరిగి వస్తుందని అన్నారు. అంధేరీ ఉప ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారు. ఎందుకంటే ఉద్ధవ్ శివసేన శిబిరం అభ్యర్థికి ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతిచ్చాయని పేర్కొన్నారు. 

ఎన్నికల సంఘం ఏం చెప్పింది

వాస్తవానికి, అంధేరీ తూర్పు అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ పేరు, చిహ్నాన్ని ఉపయోగించకుండా మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాలను ఎన్నికల సంఘం శనివారం నిషేధించింది. 
  
అంధేరీ ఉప‌ ఎన్నికలు

శివసేన ఎమ్మెల్యే రమేశ్ లత్కే మరణంతో సబర్బన్ ముంబైలోని అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నిక అనివార్యమైంది. మహారాష్ట్ర వికాస్ అఘాడి (MVA)లో తమ కూటమి భాగస్వామి అయిన శివసేన థాకరే వర్గానికి చెందిన అభ్యర్థి రమేష్ లట్కే భార్య రుజుతా లట్కేకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, ఎన్సీపీ నిర్ణయించాయి. షిండే వర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా ఉన్న ముర్జీ పటేల్‌ను పోటీకి దింపాలని నిర్ణయించింది.

'ఎన్నికల సంఘం నిర్ణయం ఆశ్చర్యం, బాధాకరం'

శివసేన ఎన్నికల చిహ్నాన్ని, పార్టీ పేరును నిషేధిస్తూ భారత ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం, బాధాకరమని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి మహేశ్ తాప్సీ అన్నారు. అయితే ఇది కమిషన్ తుది నిర్ణయం కాదనీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని (శివసేన) శిబిరం ఉప ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, పార్టీ పేరు, గుర్తును ఉపయోగించడం నిషేధించబడింది. గుర్తును స్తంభింపజేయడం అంటే (ఠాక్రే నేతృత్వంలోని) శివసేన కార్యకర్తలు బలహీనంగా మారారని కాదని అన్నారు  ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పాటు శివసేన (ఠాక్రే వర్గం) బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందని తాప్సీ అన్నారు. 

ఉద్ధవ్ ఠాక్రే క్యాంపు అభ్యర్థిపై బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టినందున ఈ ఎన్నికలు ముఖాముఖిగా జరుగుతాయని ఆయన అన్నారు. ఠాక్రే నేతృత్వంలోని శివసేన శనివారం ఎన్నికల సంఘం ఆదేశాలను అన్యాయంగా, అభివర్ణించగా సిఎం షిండే నేతృత్వంలోని బృందం ఈ ఉత్తర్వును సమర్థించిందని పేర్కొంది. అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల గుర్తులను కేటాయించాలన్న డిమాండ్ షిండే వర్గం అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం