Mumbai: కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ మాజీ అధ్యక్షుని నాయకత్వంలో కొనసాగుతున్న దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర నవంబర్ మొదటి వారంలో మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. అయితే, అక్కడ కొనసాగే భారత్ జోడో యాత్రలో శివసేనతో పాటు ఎన్సీపీ శ్రేణులు కూడా పాల్గొనే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో శివసేనతో పాటు ఎన్సీపీ అధినేతలు, ఆయా పార్టీల శ్రేణులు పాల్గొంటాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శివసేన చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ భారత్ జోడో యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు తెలిపారు. ఇదివరకు భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా ఇరువురు నేతలకు ఆహ్వానం పంపింది కాంగ్రెస్. దానికి వారు అంగీకరించారని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల బృందం సోమవారం మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాసం 'మాతోశ్రీ'లో, శరద్ పవార్ను సిల్వర్ ఓక్లో కలుసుకుని భారత్ జోడో యాత్రకు ఆహ్వానించారు. ఈ సమావేశంలో హెచ్కే పాటిల్, అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరట్, నసీమ్ ఖాన్, భాయ్ జగ్తాప్, యువజన నాయకుడు సూరజ్ ఠాకూర్ సహా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ మాజీ అధ్యక్షుని నాయకత్వంలో కొనసాగుతున్న దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర నవంబర్ మొదటి వారంలో మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. నాందేడ్ జిల్లా నుండి రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. యాత్రలో పాల్గొనవలసిందిగా కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఇద్దరు నేతలను ఆహ్వానించింది. "ఇద్దరూ ఆహ్వానాన్ని అంగీకరించారు. శరద్ పవార్ స్వయంగా, శివసేనకు చెందిన ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాకరే యాత్రలో పాల్గొంటారని ప్రతినిధి బృందానికి చెప్పబడింది" అని కాంగ్రెస్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి మద్దతు లభిస్తుండగా, రోజురోజుకూ స్పందన పెరుగుతోంది. మహారాష్ట్రలో కూడా, ఎన్సీపీ, శివసేన (థాక్రే వర్గం) యాత్రలో పాల్గొనడానికి అంగీకరించాయి. దీంతో యాత్ర ప్రాముఖ్యతను మరింత పెంచింది.
భారత్ జోడో యాత్ర 7 సెప్టెంబర్ 2022న ప్రారంభించారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. భారత్ జోడో యాత్ర ప్రారంభమైన తర్వాత శనివారం 1000 కిలోమీటర్లను కవర్ చేస్తూ ఒక మైలురాయిని చేరుకుంది. 3500 కిలోమీటర్ల యాత్ర కాంగ్రెస్కు, యావత్ దేశానికి చారిత్రాత్మక ఘట్టం. భారతదేశ చరిత్రలో ఏ భారతీయ రాజకీయ నాయకుడూ కాలినడకన సాగిన సుదీర్ఘ పాదయాత్ర ఇదే అని కాంగ్రెస్ ముందుగా ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక మహాత్మా గాంధీ దండి మార్చ్ గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి ఆశ్రమం నుండి దండి (నవసరి) వరకు కాలినడకన (24 రోజులలో 389 కిలోమీటర్లు) సుదీర్ఘమైన కవాతుగా ఉంది. భారత్ జోడో యాత్ర బళ్లారి జిల్లా శివార్లలోకి చేరుకున్నప్పుడు 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. అక్కడ లక్షలాది మంది కాంగ్రెస్ మద్దతుదారులతో భారీ సదస్సు జరుగుతుందని పార్టీ తన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆంధప్రదేశ్ లోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించింది.
आंध्र प्रदेश में फूलों की बारिश से हुआ श्री जी का भव्य स्वागत 💐 pic.twitter.com/sBXB9bWsmy
— Nitin Agarwal (@nitinagarwalINC)