విద్యుత్ కోసం ఏడున్నర దశాబ్దాలు ఎదురుచూసిన గ్రామం..ఎక్కడో తెలుసా..? 

Published : Aug 17, 2023, 03:23 PM ISTUpdated : Aug 17, 2023, 03:36 PM IST
విద్యుత్ కోసం ఏడున్నర దశాబ్దాలు ఎదురుచూసిన గ్రామం..ఎక్కడో తెలుసా..? 

సారాంశం

ఈ గ్రామం విద్యుత్ కోసం ఏడున్నర దశాబ్దాలుగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌తో సమన్వయంతో జిల్లా పోలీసుల కృషితో ఆగస్టు 14న ఈ ఘనత సాధించింది.

స్వాతంత్ర వచ్చి  ఏడున్నర దశాబ్దాలు గడుస్తున్న ఇంకా కొన్ని గ్రామాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. ప్రగతి ఆమడ దూరంలో నిలిచాయి. ఇలాంటి కోవకే చెందిన ఓ గ్రామానికి చెందిన కథనమిది. అది ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లా. ఆ జిల్లాలోని ఓ మారుమూలన ప్రాంతమే ఎల్మగుండ గ్రామం. ఈ గ్రామంలో 2023,ఆగస్టు 14 వరకు కరెంటు లేదు. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ..అంధకారంలోనే జీవనం సాగించారు.

వీరి అవస్థలు చూసిన భద్రత సిబ్బంది, పోలీసులు అధికారులు .. గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి నక్సల్స్‌ కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధికి పాటుపడేలా వారిని ఒప్పించారు. దీంతో  అక్కడ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. స్వాతంత్ర వచ్చిన ఏడున్నర దశాబ్దాల తరువాత ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌తో సమన్వయంతో జిల్లా పోలీసుల కృషితో ఆగస్టు 14న తొలిసారి వారి గ్రామానికి విద్యుత్ వెలుగులతో దేదీప్యమానంగా వెలిగింది.  

ఈ సందర్భంగా బస్తర్ రేంజ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్ మాట్లాడుతూ.. ఎల్మగుండ గ్రామంలో నక్సల్ ప్రభావం అధికంగా ఉండేది. దీంతో భద్రతా బలగాల శిబిరాన్ని ఏర్పాటు అవగాహనా కార్యక్రమాలను చేపట్టామని,  ఈ మారుమూల గ్రామాల్లోని భద్రతా శిబిరాలు కూడా సమగ్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నాయని తెలిపారు. గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి నక్సల్స్‌ కార్యకలాపాలపై అవగాహన కల్పించి గ్రామాభివృద్ధికి పాటుపడేలా వారిని ఒప్పించామని తెలిపారు.

గ్రామస్తులను నక్సలైట్లకు దూరంగా ఉండాలని కోరినట్టు తెలిపారు. ఈ క్రమంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బంది కూడా ఈ పనికి సహకరించిందని తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఇతర ఏజెన్సీల ప్రయత్నాలు ఆ గ్రామస్తుల ముఖాల్లో చిరునవ్వు తెచ్చాయనన్నారు. దాదాపు ఆరు నెలల క్రితం ఎల్మగుండలో భద్రతా బలగాల శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుక్మా జిల్లాలోని ఎల్మగుండ గ్రామంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. గతేడాది నక్సల్‌ కార్యకలాపాల నుంచి విముక్తి పొందిన గ్రామానికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు.  

బస్తర్ రేంజ్‌లోని భద్రతా శిబిరాలు కార్యాచరణ పనులను మాత్రమే కాకుండా..స్థానిక పరిపాలనతో సమన్వయంతో రోడ్ల నిర్మాణం, విద్యుదీకరణ, PDS దుకాణాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ,  ఆరోగ్య కేంద్రాలను తెరవడం వంటి అభివృద్ధి పనులను కూడా సులభతరం చేస్తాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. గత నాలుగు సంవత్సరాలలో భద్రతా శిబిరాలు స్థానిక ప్రజల జీవితాల్లో గేమ్ ఛేంజర్ పాత్రను పోషిస్తున్నాయని, అనేక ఉదాహరణలలో ఎల్మగుండ గ్రామం ఒకటని ఆయన అన్నారు.

సుక్మా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పి) కిరణ్ చవాన్ మాట్లాడుతూ.. నక్సలిజాన్ని నిర్మూలించడానికి, విశ్రాంత గ్రామాలపై గ్రామస్థుల విశ్వాసాన్ని పెంచడానికి భద్రతా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలమగుడ్నాలోని ఇళ్లలో విద్యుత్తు అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి ,స్థానిక జనాభాను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో,  దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి సహాయపడుతుందని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Indian Army Creates Modern Warfare Force: ఇండియన్ ఆర్మీ "మోడ్రన్ వార్‌ఫేర్ ఫోర్స్" | Asianet Telugu
India First Vande Bharat Sleeper Train: వందే భారత్ స్లీపర్ లోపల ఎలా ఉంటుందో తెలుసా? | Asianet Telugu