సంగీత విద్వాంసుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ ఇక లేరు..

By Sairam IndurFirst Published Jan 9, 2024, 5:00 PM IST
Highlights

Maestro Rashid Khan : సంగీత విద్వాంసుడు రషీద్ ఖాన్ ఇక లేరు. గత కొంత కాలం నుంచి ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితమే కోల్ కతాలోని ఓ హాస్పిటల్ లో చనిపోయారు.

Ustad Rashid Khan : ప్రముఖ సంగీ విద్వాంసుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ కన్నుమూశారు. కొంత కాలం నుంచి ప్రొస్టేట్ క్యాన్సర్ తో ఆయన బాధపడుతున్నారు. దాని కోసం కోల్ కతాకు చెందిన ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ పై ఉండి ఆక్సిజన్ సపోర్ట్ పై ఉన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం ఆయన  తన 55 ఏళ్ల వయస్సులో చనిపోయారు.

భక్తిని చూపించండి.. అనవసర ప్రకటనలు చేయొద్దు - బీజేపీ నేతలకు ప్రధాని సూచన

Latest Videos

గత నెలలో ఆయనకు సెరిబ్రల్ ఎటాక్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. రాంపూర్-సహస్వాన్ ఘరానాకు చెందిన రషీద్ ఖాన్.. తొలుత టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అయితే ఆ తర్వాతి దశలో కోల్ కతాలోనే చికిత్స కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. గత నెలలో ప్రైవేటు హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందించారు. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. 
 

He was such a special artiste… sahab has left the world so early… pic.twitter.com/vXZaZX59S9

— Priya Gupta (@priyagupta999)

ఉత్తరప్రదేశ్ లోని బదాయూన్ లో జన్మించిన రషీద్ ఖాన్ తన మేనమామ ఉస్తాద్ నిస్సార్ హుస్సేన్ ఖాన్ (1909-1993) వద్ద ప్రాథమిక శిక్షణ పొందాడు. రషీద్ కు ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ మేనమామ అవుతారు. కాగా.. ఆయన మరణంపై సోషల్ మీడియాతో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 

click me!