Raj Thackeray: మ‌హారాష్ట్ర‌లో లౌడ్ స్పీకర్ల వివాదం… రాజ్ థాక్రేపై ఎఫ్‌ఐఆర్

Published : May 04, 2022, 05:14 AM IST
Raj Thackeray: మ‌హారాష్ట్ర‌లో లౌడ్ స్పీకర్ల వివాదం… రాజ్ థాక్రేపై ఎఫ్‌ఐఆర్

సారాంశం

Raj Thackeray: ఔరంగాబాద్ ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ థాక్రేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాలీ నిర్వాహకులు మరో ముగ్గురి పేర్లనూ ఎఫ్ ఐఆర్‌లో పోలీసులు చేర్చారు. ఘర్షణలకు దారి తీసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని థాక్రేపై అభియోగాలు నమోదు చేశారు.

Raj Thackeray: మహారాష్ట్రలో లౌడ్‌స్పీకర్లతో మొదలైన రచ్చ క్ర‌మంగా పెరుగుతోంది. ఔరంగాబాద్‌లో జ‌రిగిన‌ ర్యాలీలో  ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేసినందుకు MNS చీఫ్ రాజ్ థాకరేతో సహా నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఔరంగాబాద్‌లోని సిటీ చౌక్ పోలీస్ స్టేషన్‌లో రాజ్ థాక‌రేపై  ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఉద్ధవ్ ప్రభుత్వం రాజ్ ఠాక్రేకు నోటీసులు కూడా జారీ చేసింది.

ఘర్షణలకు దారి తీసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని థాక్రేపై అభియోగాలు నమోదు చేశారు. మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల ను తొలగించాలని, ఉద్ధవ్ థాక్రే సర్కార్‌కు రాజ్‌థాక్రే అల్టిమేటం ఇచ్చారు. మే 3 లోగా మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించాలని గతంలో ముంబై ర్యాలీలో ఆయన మహారాష్ట్ర సర్కార్‌కు గడువు విధించిన విష‌యం తెలిసిందే..

 ఔరంగాబాద్ కేసులో రాజ్ థాకరే, రాజీవ్ జెవ్లికర్, ఇతర ర్యాలీ నిర్వాహకులపై 1973 మహారాష్ట్ర పోలీస్ యాక్ట్, 1951లోని సెక్షన్ 116, 117, 153, 135 కింద కేసు న‌మోదు చేశారు పోలీసులు.  ఔరంగాబాద్‌లో ఆదివారం జరిగిన ర్యాలీలో రాజ్‌థాక్రే మళ్లీ మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 
 
 మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల ను తొలగించాలని, ఉద్ధవ్ థాక్రే సర్కార్‌కు రాజ్‌థాక్రే Raj Thackeray అల్టిమేటం ఇచ్చారు. మే 3 లోగా మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించాలని గతంలో ముంబై ర్యాలీలో ఆయన మహారాష్ట్ర సర్కార్‌కు గడువు విధించారు. ఇక గడువు దగ్గర పడిన క్రమంలో ఔరంగాబాద్‌లో ఆదివారం జరిగిన ర్యాలీలో రాజ్‌థాక్రే మళ్లీ మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 3 న ఈద్ దృష్టా మే 4 లోగా, మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించాలని, లేకుంటే మసీదుల ఎదుట తమ పార్టీ భారీ శబ్దంతో హనుమాన్ చాలీసా వినిపిస్తామని హెచ్చరించారు. మే 4 తరువాత తాము ఎవరేం చెప్పినా వినిపించుకోమని స్పష్టం చేశారు.


 మంగళవారం ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే Raj Thackeray సోషల్ మీడియాలో మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు. "రేపు మే 4వ తారీఖున, మీరు అజాన్‌తో మోగించే లౌడ్‌స్పీకర్‌లు వింటుంటే, ఆ ప్రదేశాలలో హనుమాన్ చాలీసాను లౌడ్‌స్పీకర్లలో ప్లే చేయండి! అప్పుడే ఈ లౌడ్‌స్పీకర్ల అవరోధం ఏమిటో గ్రహిస్తారని నేను హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను!" అతని ప్రకటన విడుద‌ల చేశారు. 


నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను అందరూ పాటించాలని థాకరే తన ప్రకటనలో పేర్కొన్నారు.  పలువురు MNS నాయకులు ఇప్పటికే నోటీసులు అందుకున్నారు మరియు వందల మందిపై నివారణ చర్యలు కూడా తీసుకున్నారు. 

ర్యాలీకి సంబంధించిన‌ వీడియోను చూసిన ఔరంగాబాద్ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. సామరస్యానికి భంగం కలిగించే వారిని వదిలిపెట్టబోమని మహారాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డీజీపీ రజనీష్ సేథ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఔరంగాబాద్ పోలీస్ కమిషనర్ ప్రసంగంపై దర్యాప్తు చేస్తున్నారు. అతను అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాడు.

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi: మసాలా చాట్ టేస్ట్ చేసి పిల్లలకు పంచిన ప్రధాని మోదీ| Asianet News Telugu
Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?| Asianet News Telugu