మృత్యువుతో పోరాడి ఓడిన ముంబయి ‘నిర్భయ’.. హాస్పిటల్‌లో తుదిశ్వాస

Published : Sep 11, 2021, 01:28 PM ISTUpdated : Sep 11, 2021, 01:59 PM IST
మృత్యువుతో పోరాడి ఓడిన ముంబయి ‘నిర్భయ’.. హాస్పిటల్‌లో తుదిశ్వాస

సారాంశం

ఢిల్లీలో 2012లో నిర్భయ ఘటనను తలిపించే ముంబయిలో దుర్ఘటన చోటుచేసుకుంది. మహిళపై లైంగికదాడి చేసి ఆమె ప్రైవేటు భాగాల్లో రాడ్లతో దాడి చేశారు. ఖైరాని రోడ్డు పక్కన రక్తపుమడుగులో పడి ఉన్న బాధితురాలిని శుక్రవారం హాస్పిటల్ చేర్చగా శనివారం ఉదయ ఆమె తుదిశ్వాస విడిచారు.  

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో నిర్భయ తరహా లైంగికదాడికి గురైన ఓ మహిళ 33 గంటలపాటు హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడి ఓడారు. శనివారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెపై పాశవిక లైంగికదాడి ముంబయిలోని సాకినాక సబర్బన్‌లో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆ దాడి వివరాలు తెలియడంతో 2012లో దేశాన్ని కదిలించిన ఢిల్లీ నిర్భయ కేసు మదిలో మెదిలింది.

కొందరు దుర్మార్గులు మహిళను బంధించి ఓ టెంపో వాహనంలో లైంగికదాడి చేశారని అనుమానిస్తున్నారు. అనంతరం ఆమె ప్రైవేటు భాగాల్లోకి రాడ్లు చొప్పించినట్టు తెలిసింది. ఆమె విలవిల్లాడుతుంటే ఆ కామాంధులు రాక్షసానందం పొందారు. చివరకు ఖైరాని రోడ్డుపక్కన ఆ బాధితురాలిని వదిలిపెట్టి పారిపోయినట్టు తెలిసింది.

ఆ మహిళను ఎవరో దాడి చేస్తున్నారని, రక్తపు మడుగులో మహిళ కొట్టుమిట్టాడుతున్నదని పోలీసుల కంట్రోల్ రూమ్‌కు ఓ కాల్ వచ్చింది. పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరగా బాధితురాలు ఒక్కతే కొన ఊపిరితో జీవం కోసం పోరాడుతున్నట్టు గుర్తించారు. వెంటనే ఘాట్కోపర్‌లోని రాజావాడి ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందున్న ఆమె శనివారం ఉదయం మరణించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మోహన్ చౌహాన్(45)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దుర్మార్గంలో మరికొందరు ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన ఎప్పుడు జరిగిందనే విషయాన్ని పోలీసులు స్పష్టంగా వెల్లడించలేదు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?