ముంబైలో పుట్‌పాత్‌పై పాదచారులను ఢీకొన్న కారు: నలుగురు మృతి

Published : Sep 01, 2020, 11:33 AM IST
ముంబైలో పుట్‌పాత్‌పై పాదచారులను ఢీకొన్న కారు: నలుగురు మృతి

సారాంశం

మహారాష్ట్రలోని ముంబై నగరంలో కారు ప్రమాదంలో నలుగురు మరణించారు. ముంబై పట్టణంలోని క్రాఫోర్డ్ మార్కెట్లో సోమవారం నాడు రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కొలంబో జంక్షన్ లోని కేఫ్ జనతా వద్ద పుట్ ఫాత్ పై  అదుపుతప్పిన కారు దూసుకు వచ్చింది. 


ముంబై: మహారాష్ట్రలోని ముంబై నగరంలో కారు ప్రమాదంలో నలుగురు మరణించారు. ముంబై పట్టణంలోని క్రాఫోర్డ్ మార్కెట్లో సోమవారం నాడు రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కొలంబో జంక్షన్ లోని కేఫ్ జనతా వద్ద పుట్ ఫాత్ పై  అదుపుతప్పిన కారు దూసుకు వచ్చింది. 

పుట్ పాత్ పై ఉన్న వారిలో పలువురిని కారు డీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఓ వ్యక్తి కారుపై పడి మరణించారు. మరో ముగ్గురు సమీపంలోని రెస్టారెంట్ లో ఎగిరిపడ్డారు. 

ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ముంబైకి చెందిన జ్యోతి బాబరియాకు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు.ఈ ప్రమాదంలో కారు డ్రైవర్  సమీర్ ఇబ్రహీంకి కూడ గాయాలయ్యాయి. 

కారు అతివేగంగా ఉండడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొన్నట్టుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఇక ప‌ని అయిపోంది అనుకున్న స‌మ‌యంలో పీకే వండ‌ర్‌.. ప్ర‌శాంత్ కిశోర్ గెలుపు అస‌లు కార‌ణ‌లేంటి?
బీహార్‍లో బీజేపీకి షాక్.. కమలం ఓడిపోవడానికి కారణమిదే | Prashant Kishor | Bihar By Election Result