యువతిపై సామూహిక అత్యాచారం.. ఇంటికి తిరిగి వస్తుండగా మాట్లాడాలని పిలిచి దారుణం..

By Sumanth KanukulaFirst Published Jan 23, 2022, 11:41 AM IST
Highlights

ఓ 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేరానికి పాల్పడిన వారిలో మైనర్లు కూడా ఉన్నారు. యువతి తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. 

ఓ 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేరానికి పాల్పడిన వారిలో మైనర్లు కూడా ఉన్నారు. యువతి తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్ర ముంబైలోని గోవండి ప్రాంతంలోని (Govandi area) శివాజీ నగర్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. నాలుగో వ్యక్తి కసం గాలింపు కొసాగుతుందని చెప్పారు. 

వివరాలు.. బాధిత మహిళ క్యాటరింగ్ కంపెనీలో పనిచేస్తుంది. అయితే తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో మహిళతో ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి ఒకరు మాట్లాడారు. కొంత పని ఉందని చెప్పి.. ఆమెను అతడితో పాటు తీసుకెళ్లాడు. అయితే చివరకు మహిళను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అయితే మహిళకు తెలియకుండా వెనకాలే వచ్చిన అతని స్నేహితులు కూడా అక్కడికి చేరుకున్నారు. అనంతరం నలుగురు కలిసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. 

నిందితులు పారిపోయిన తర్వాత భాదితురాలు పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని రక్షించారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం) తో పాటుగా సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం నిందితులు పట్టుకోవడానికి పోలీసులు వజ్రేశ్వరి, ముంబ్రా, వాషి, బేలాపూర్, వడాలా, సీఎస్‌ఎంటీ, ఎల్‌టీ మార్గ్, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లకు 10 పోలీసు బృందాలను పంపినట్టుగా పోలీసు అధికారి ఒకరు చెప్పారు. 

శనివారం మధ్యాహ్నం రైలులో ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు మైనర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఆ అధికారి తెలిపారు. ఆ తర్వాత మరో మైనర్ నిందితుడిని కూడా పట్టుకున్నట్టుగా చెప్పారు. ఈ కేసుకు మరో నిందితుడి కోసం గాలింపు జరుగుతుందన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు. 

click me!